Crime News: మౌలాలి రైల్వే కాలనీలో 2019లో జరిగిన రిటైర్డ్ ఉద్యోగి మారుతి సుతార్ హత్య కేసులో మల్కాజిగిరి కోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. రూ. 30 వేల పింఛను కోసం తండ్రిని ఉమ్మెత్త పొడి ఇచ్చి, కత్తులతో నరికి బకెట్లలో దాచిన కొడుకు కిషన్, కూతురు ప్రపుల్లకు ఉరిశిక్ష విధించింది. హత్యకు సహకరించిన భార్య గంగాబాయికి జీవిత ఖైదు విధిస్తూ జడ్జి వి.బాలభాస్కర్రావు తీర్పునిచ్చారు.
మరింత Crime News: పింఛను డబ్బు కోసం కన్నతండ్రిని ముక్కలుగా నరికిన కేసు.. కొడుకు, కూతురికి ఉరిశిక్ష..!Tag: Crime News
Missing Case: మిస్సింగ్ కేసు విషాదాంతం.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య..!
Missing Case: గత నెల 27న టూర్కు వెళ్తానని చెప్పి కాచిగూడలో శబరి ఎక్స్ప్రెస్ ఎక్కి అదృశ్యమైన బీటెక్ విద్యార్థి రాహుల్, ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఒక బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరింత Missing Case: మిస్సింగ్ కేసు విషాదాంతం.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య..!Delhi Professor: కోట్ల ఆస్తి కోసం ఢిల్లీ ప్రొఫెసర్ దారుణ హత్య.. మూడో రోజే కేసు ఛేదించిన పోలీసులు!
Delhi Professor: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ దేవోస్మిత పాల్ హత్య కేసును పోలీసులు మూడు రోజుల్లో ఛేదించారు. బెంగాల్లోని ఆమె కోట్ల విలువైన వారసత్వ ఆస్తిని దక్కించుకోవడానికి, అక్కడ అద్దెకు ఉంటున్న దంపతులే ఈ హత్యకు ఒడిగట్టారు. ముసుగులు ధరించి, బిడ్డతో కలిసి ఢిల్లీలోని ఆమె ఫ్లాట్కు వచ్చి హత్య చేసిన దంపతులను పోలీసులు బెంగాల్లోని బర్ధమాన్లో అరెస్ట్ చేశారు.
మరింత Delhi Professor: కోట్ల ఆస్తి కోసం ఢిల్లీ ప్రొఫెసర్ దారుణ హత్య.. మూడో రోజే కేసు ఛేదించిన పోలీసులు!Delhi Fire Accident: రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం.. ప్రాణాలు కాపాడుకోవడానికి బిల్డింగ్ పైనుంచి దూకిన మహిళ!
Delhi Fire Accident: ఢిల్లీ మాల్వీయనగర్లోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో బుధవారం ఉదయం 9 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. భవనంలో మరో 40 మంది చిక్కుకున్నట్లు సమాచారం. 10 అగ్నిమాపక వాహనాలతో సహాయక చర్యలు కొనసాగుతుండగా, బేస్మెంట్ నుండి ముగ్గురిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.
మరింత Delhi Fire Accident: రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం.. ప్రాణాలు కాపాడుకోవడానికి బిల్డింగ్ పైనుంచి దూకిన మహిళ!Crime News: పెళ్లి జరిగిన కొద్ది గంటల్లోనే విషాదం.. భారతీయ పైలట్ దుర్మరణం!
Crime News: అమెరికాలోని జార్జియాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో కేరళ మూలాలున్న భారత సంతతి పైలట్ డేవ్ ఫిజి (25) పెళ్లయిన కొద్ది గంటలకే మరణించాడు. ప్రతికూల వాతావరణంలో పైలట్ హెలికాప్టర్ నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పైలట్ కూడా మరణించగా, కొత్త పెళ్లికూతురు జెస్ని తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడింది.
మరింత Crime News: పెళ్లి జరిగిన కొద్ది గంటల్లోనే విషాదం.. భారతీయ పైలట్ దుర్మరణం!Tragedy: స్నేహితుల ప్రాణాలు కాపాడి.. అమెరికాలో తెలుగు విద్యార్థి ‘అనురూప్ రెడ్డి’ వీరమరణం!
Tragedy: అమెరికాలోని టోలెడో బెండ్ రిజర్వాయర్లో మునిగిపోతున్న ముగ్గురు స్నేహితులను కాపాడి నల్గొండకు చెందిన తెలుగు విద్యార్థి అనురూప్ రెడ్డి (22) మృతి చెందాడు. అందరినీ ఒడ్డుకు చేర్చిన తర్వాత అతని కాలు నీటిలోని చేపల వేట వైరుకు చుట్టుకుపోవడంతో బయటకు రాలేకపోయాడు. యూనివర్శిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ గ్రాడ్యుయేట్ అయిన అనురూప్ మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు కుటుంబ సభ్యులు విరాళాలు సేకరిస్తున్నారు.
మరింత Tragedy: స్నేహితుల ప్రాణాలు కాపాడి.. అమెరికాలో తెలుగు విద్యార్థి ‘అనురూప్ రెడ్డి’ వీరమరణం!Khaja Moinuddin Murder: రెండేళ్లుగా స్కెచ్.. 10 సార్లు తప్పించుకున్న మొయినుద్దీన్!
Khaja Moinuddin Murder: అడ్వొకేట్ మొయినుద్దీన్ హత్యాయత్నం కేసులో ఆలంఖాన్ మరియు అతని కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాత కక్షల నేపథ్యంలో మొయినుద్దీన్ను చంపేందుకు వీరు రూ.25 లక్షల సుపారీ ఇచ్చినట్లు తేలింది. గత రెండేళ్లలో ఆయనను హతమార్చడానికి నిందితులు 10 సార్లు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు.
మరింత Khaja Moinuddin Murder: రెండేళ్లుగా స్కెచ్.. 10 సార్లు తప్పించుకున్న మొయినుద్దీన్!Bandi Bhagirath: నేటితో ముగియనున్న బండి భగీరథ్ పోలీస్ కస్టడీ
Bandi Bhagirath: పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్ రెండు రోజుల పోలీస్ కస్టడీ నేటితో ముగిసింది. డిజిటల్ ఆధారాలు, కాల్ డేటాపై పోలీసులు ఆయనను విచారించి వివరాలు సేకరించారు. కస్టడీ గడువు ముగియడంతో శుక్రవారం ఆయనను న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.
మరింత Bandi Bhagirath: నేటితో ముగియనున్న బండి భగీరథ్ పోలీస్ కస్టడీCrime News: ప్రేమించి పెళ్లాడితే నెల రోజులకే నరకం.. పుట్టింటికి వచ్చి ఆత్మహత్య
Crime News: చనుబండ శివారుకు చెందిన డిగ్రీ విద్యార్థిని చంద్రలేఖ (22), ఆరెళ్ల లితిన్ అనే యువకుడిని ప్రేమించి గత నెలలో పెళ్లి చేసుకుంది. అయితే కట్నం తేవలేదంటూ అత్తింటివారు భౌతిక దాడికి దిగడంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. పోలీసుల కౌన్సిలింగ్కు వెళ్లాల్సిన రోజే.. తప్పు చేశాననే గిల్ట్ ఫీలింగ్తో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మరింత Crime News: ప్రేమించి పెళ్లాడితే నెల రోజులకే నరకం.. పుట్టింటికి వచ్చి ఆత్మహత్యVijayawada: విజయవాడలో లవ్ ట్రయాంగిల్ రచ్చ.. ఒకే అమ్మాయి కోసం నడిరోడ్డుపై థార్ జీపులతో గుద్దుకున్న ప్రాణస్నేహితులు!
Vijayawada: ఒక్క అమ్మాయి వల్ల చిన్నపాటి ప్రాణస్నేహితులు కూడా విడిపోతారు, చివరికి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్తారు.. అలాంటి ఘటన తాజాగా ఒకటి చోటుచేసుకుంది. నడిరోడ్డుపైనే తమ వాహనాలతో ఒకరిని ఒకరు ఢీకొట్టుకున్నారు.
మరింత Vijayawada: విజయవాడలో లవ్ ట్రయాంగిల్ రచ్చ.. ఒకే అమ్మాయి కోసం నడిరోడ్డుపై థార్ జీపులతో గుద్దుకున్న ప్రాణస్నేహితులు!