Kishan Reddy: మెట్రో రైలుపై బురదజల్లడం ఆపండి.. మేము సీఎంకు కాదు, ప్రజలకే జవాబుదారీ!
Kishan Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మెట్రో ఫేజ్-1కు కేంద్రం రూ.1200 కోట్లు ఇచ్చిందని చెప్తూ.. మెట్రోపై బురదజల్లే ప్రయత్నం సరికాదన్నారు. తాము రేవంత్కు కాకుండా తెలంగాణ ప్రజలకు జవాబుదారీ అని స్పష్టం చేశారు. రూ.13 వేల కోట్ల IRFC లోన్ పెండింగ్కు పలు కారణాలు ఉన్నాయని, దీనిపై కేంద్ర, రాష్ట్ర అధికారులు కలిసి చర్చించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.







