Annamalai

Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై.. ‘AMI’ ఉద్యమంతో కొత్త పార్టీకి శ్రీకారం!

Annamalai:  తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ కె. అన్నామలై పార్టీకి రాజీనామా చేసి, ‘అన్నామలై మక్కల్ ఇయక్కం’ (AMI) అనే కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. తమిళనాడులో కుటుంబ, వ్యక్తి ఆరాధన రాజకీయాలను అంతం చేసి సామాన్యుడి రాజకీయాలను తీసుకురావడమే తన లక్ష్యమని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.

మరింత Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై.. ‘AMI’ ఉద్యమంతో కొత్త పార్టీకి శ్రీకారం!
Nandus World

Nandus World: నందూస్ వరల్డ్’ జంటకు మరింతగా బిగుస్తున్న ఉచ్చు.. లుక్‌అవుట్ నోటీసులు జారీ

Nandus World: యూకే వీసాల రెన్యూవల్ పేరుతో కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ‘నందూస్ వరల్డ్’ యూట్యూబర్ రమా నందన, ఆమె భర్త మధుకర్ జాగర్లమూడిలపై ఇబ్రహీంపట్నం పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. వారు దేశం విడిచి వెళ్లకుండా అన్ని ఎయిర్‌పోర్టులను అప్రమత్తం చేశారు.

మరింత Nandus World: నందూస్ వరల్డ్’ జంటకు మరింతగా బిగుస్తున్న ఉచ్చు.. లుక్‌అవుట్ నోటీసులు జారీ
AP News

AP News: కదిలే రైలు ఇంజన్‌పై రాళ్ల దాడి చేసిన దుండగులు

AP News: ఢిల్లీ-చెన్నై గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌పై సింగరాయకొండ సమీపంలో దుండగులు రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో విజయవాడకు చెందిన లోకో పైలట్ జయరామ్ తీవ్రంగా గాయపడగా, రైలును ఉలవపాడులో నిలిపివేసి ఆయన్ను రైల్వే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత AP News: కదిలే రైలు ఇంజన్‌పై రాళ్ల దాడి చేసిన దుండగులు
Chandrababu

Chandrababu: విశాఖలో సీఎం చంద్రబాబు సైకిల్ ప్రయాణం.. ఏయూ వీసీకి కీలక ఆదేశాలు!

Chandrababu: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటించి మొక్కలు నాటారు. పర్యావరణంపై అవగాహన కోసం ఏయూ నుండి 4 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేశారు. ఏయూలో గ్రీనరీ 25% మాత్రమే ఉండటంపై అసహనం వ్యక్తం చేస్తూ, దాన్ని పెంచాలని వీసీని ఆదేశించారు. అలాగే తిరుమలలో త్వరలోనే పచ్చదనం 90 శాతానికి చేరుకుంటుందని సీఎం వెల్లడించారు.

మరింత Chandrababu: విశాఖలో సీఎం చంద్రబాబు సైకిల్ ప్రయాణం.. ఏయూ వీసీకి కీలక ఆదేశాలు!
Peddi Collections

Peddi Collections: బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న ‘పెద్ది’.. ఫస్ట్ డే కలెక్షన్స్ తో అన్ని రికార్డ్స్ బ్రేక్

Peddi Collections: రామ్ చరణ్, బుచ్చిబాబుల ‘పెద్ది’ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 135.36 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ కెరీర్‌లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన మరో బిగ్గెస్ట్ ఓపెనర్ ఇది. ఏఆర్ రెహమాన్ సంగీతం, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం లాంగ్ రన్‌లో మరిన్ని రికార్డులను బద్దలు కొట్టేలా ఉంది.

మరింత Peddi Collections: బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న ‘పెద్ది’.. ఫస్ట్ డే కలెక్షన్స్ తో అన్ని రికార్డ్స్ బ్రేక్
Pawan Kalyan

Pawan Kalyan: 10 రోజుల పాటు ప్రజా ఉద్యమం.. డ్రోన్ల ద్వారా విత్తన బంతుల చల్లింపు!

Pawan Kalyan: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్‌ఫ్లై పార్క్‌లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన తల్లి అంజనాదేవి పేరిట తెల్ల పొనికి మొక్కను నాటారు. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 15 వరకు 10 రోజుల పాటు 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేసి డ్రోన్ల ద్వారా చల్లబోతున్నట్లు ప్రకటించారు. పరిశ్రమలలో 30% గ్రీన్ బెల్ట్ తప్పనిసరి అని, హస్తకళల కోసం వుడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

మరింత Pawan Kalyan: 10 రోజుల పాటు ప్రజా ఉద్యమం.. డ్రోన్ల ద్వారా విత్తన బంతుల చల్లింపు!
Ramalinga Reddy:  

Ramalinga Reddy: ఎమ్మెల్యేగా కొనసాగుతా.. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా

Ramalinga Reddy: కర్ణాటక నీటి పారుదలశాఖ మంత్రి రామలింగారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది. తనకు ఇష్టమైన నగరాభివృద్ధి శాఖ ఇవ్వకుండా, అవగాహన లేని శాఖ ఇచ్చారనే అసహనంతో ఆయన మంత్రి పదవిని వదులుకున్నారు. అయితే ఎమ్మెల్యేగా మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశారు.

మరింత Ramalinga Reddy: ఎమ్మెల్యేగా కొనసాగుతా.. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా
Ebola Virus:

Ebola Virus: హైదరాబాద్‌లో ఎబోలా కలకలం.. రాత్రికి రాత్రే ఇద్దరిని గాంధీ ఆస్పత్రికి తరలింపు!

Ebola Virus: సూడాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన యాగౌచ్ అహ్మద్, అబ్దుల్ మజీద్ అనే ఇద్దరిలో ఎబోలా అనుమానిత లక్షణాలు (తీవ్ర జ్వరం) కనిపించడంతో వారిని అపోలో నుండి గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డుకు తరలించారు. వీరి బ్లడ్, లాలాజలం నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్ సీసీఎంబీకి పంపారు. 48 గంటల్లో రిపోర్టులు రానున్నాయి.

మరింత Ebola Virus: హైదరాబాద్‌లో ఎబోలా కలకలం.. రాత్రికి రాత్రే ఇద్దరిని గాంధీ ఆస్పత్రికి తరలింపు!
Shreyas Iyer

Shreyas Iyer: సూర్యకుమార్‌పై వేటు.. టీ20 కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్!

Shreyas Iyer: బీసీసీఐ తీసుకున్న ఈ పెను మార్పులు.. 2028లో జరగబోయే లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ మరియు అదే ఏడాది ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ వేదికలుగా జరిగే టీ20 ప్రపంచ కప్ కోసం టీమిండియాను పటిష్టంగా సిద్ధం చేసే వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత Shreyas Iyer: సూర్యకుమార్‌పై వేటు.. టీ20 కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్!
Donald Trump

Donald Trump: మోదీ నాకు మంచి స్నేహితుడు.. భారత్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం..!

Donald Trump: ప్రధాని మోదీతో ఉన్న బలమైన స్నేహం వల్ల భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదురుతుందని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో భారత్ భారీ సుంకాలు విధించినా ఇప్పుడు అమెరికాకు లబ్ధి చేకూరుతోందన్నారు. తాజా ప్రతిపాదన ప్రకారం భారత వస్తువులపై అమెరికా పన్నులు 50% నుండి 18%కి తగ్గనున్నాయి. జూన్ 4తో ముగిసిన చర్చలు తుది దశకు చేరగా, ‘సెక్షన్ 301’ కింద అదనపు పన్నుల ప్రతిపాదన ఉన్నప్పటికీ ఇరు దేశాలు ఒప్పందంపై ఆశాభావంతో ఉన్నాయి.

మరింత Donald Trump: మోదీ నాకు మంచి స్నేహితుడు.. భారత్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం..!