Drone Attack: రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ జరిపిన భారీ డ్రోన్ దాడుల్లో ఒక భారతీయ కార్మికుడు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. గత 24 గంటల్లో రష్యా 1,000 కంటే ఎక్కువ ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసింది. కీవ్పై రష్యా చేసిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. బాధిత భారతీయులకు రాయబార కార్యాలయం అన్ని విధాలా సహాయం అందిస్తోంది.
మరింత Drone Attack: రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి.. భారతీయ కార్మికుడు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు!Category: News
Varun Sandesh: వరుణ్ సందేశ్ “బ్లాక్ మెయిల్” చిత్రం ప్రారంభం
Varun Sandesh: వరుణ్ సందేశ్, జెమిని సురేష్ ప్రధాన పాత్రలలో హనుమాన్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై అవినాష్ కూనపరెడ్డి నిర్మాతగా శ్రీనివాస్ గుండ్రెడ్డి రచన దర్శకత్వంలో ప్రారంభమైన చిత్రం బ్లాక్ మెయిల్.
మరింత Varun Sandesh: వరుణ్ సందేశ్ “బ్లాక్ మెయిల్” చిత్రం ప్రారంభంHealth Tips: దోమల అగరబత్తులు వాడితే ప్రాణాలకే ముప్పు.. 85 శాతం ఉత్పత్తులు నకిలీవే..!
Health Tips: ఇళ్లలో వాడే 85 శాతం దోమల అగరబత్తులు చట్టవిరుద్ధమైనవని మరియు ప్రభుత్వ నాణ్యతా ప్రమాణాలు లేనివని ‘హైకా’ (HICA) తాజా సర్వేలో తేలింది. వీటి నుండి వచ్చే పొగ సిగరెట్ పొగతో సమానమని, ఇవి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల కేవలం ప్రభుత్వ అనుమతి (CIR లేబుల్) ఉన్న గుర్తింపు పొందిన ప్రత్యామ్నాయాలను మాత్రమే ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరింత Health Tips: దోమల అగరబత్తులు వాడితే ప్రాణాలకే ముప్పు.. 85 శాతం ఉత్పత్తులు నకిలీవే..!Padma Awards: పద్మ పురస్కారాల ప్రదానోత్సవానికి ముహూర్తం ఖరారు..!
Padma Awards: మే 25న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మొత్తం 131 మంది ప్రముఖులకు (5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ) ఈ పురస్కారాలను అందజేయనున్నారు. ఈ వేడుకలో ప్రధాని మోదీ, అమిత్ షా తదితరులు పాల్గొంటారు.
మరింత Padma Awards: పద్మ పురస్కారాల ప్రదానోత్సవానికి ముహూర్తం ఖరారు..!Bandi Bhagirath: బండి భగీరథ్ ఐఫోన్ సీజ్ చేసిన పోలీసులు.. ఫోరెన్సిక్ ల్యాబ్కు మొబైల్!
పోక్సో కేసులో రిమాండ్లో ఉన్న బండి భగీరథ్ ఐఫోన్ను పేట్బషీరాబాద్ పోలీసులు సీజ్ చేశారు. బాధితురాలితో జరిపిన చాట్స్, కాల్ డేటాను వెలికితీసేందుకు ఆ ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపుతున్నారు. నివేదిక వచ్చిన తర్వాత ఆ ఆధారాలను కోర్టుకు సమర్పించనున్నారు. అలాగే నిందితుడిని విచారించేందుకు పోలీసులు త్వరలో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు.
మరింత Bandi Bhagirath: బండి భగీరథ్ ఐఫోన్ సీజ్ చేసిన పోలీసులు.. ఫోరెన్సిక్ ల్యాబ్కు మొబైల్!Kishan Reddy: తెలంగాణ రైల్వే అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది.. యాదగిరిగుట్టకి MMTS
Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని ఉప్పుగూడ, మలక్పేట స్టేషన్లలో రైల్వే పనులను పరిశీలించారు. రూ.26 కోట్లతో ఉప్పుగూడ స్టేషన్ను డిసెంబర్ కల్లా ఆధునీకరిస్తామని, ఎంఎంటీఎస్ రైలును యాదగిరిగుట్ట వరకు పొడిగిస్తామని ప్రకటించారు. గత 12 ఏళ్లలో రాష్ట్రంలో 347 కి.మీ. కొత్త లైన్లు వేసినట్లు తెలిపారు.
మరింత Kishan Reddy: తెలంగాణ రైల్వే అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది.. యాదగిరిగుట్టకి MMTSNara Devansh: యూట్యూబ్లోకి నారా వారసుడు దేవాన్ష్.. సరికొత్త పాడ్కాస్ట్తో వస్తున్న లిటిల్ మాస్టర్!
నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ డైనోసార్ల నేపథ్యంలో ‘Dino Deets’ పేరుతో సరికొత్త సొంత పాడ్కాస్ట్ను ప్రారంభించబోతున్నాడు. దీనికి సంబంధించిన మొదటి ఎపిసోడ్ ఈ శుక్రవారం విడుదల కానుందని నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
మరింత Nara Devansh: యూట్యూబ్లోకి నారా వారసుడు దేవాన్ష్.. సరికొత్త పాడ్కాస్ట్తో వస్తున్న లిటిల్ మాస్టర్!CBSE: ఎందుకు ఈ మూడు భాషల విధానం..? జూలై 1 నుంచే అమలు!
CBSE: సీబీఎస్ఈ బోర్డు జూలై 1 నుండి 9, 10 తరగతుల విద్యార్థులకు మూడు భాషల విధానాన్ని తప్పనిసరి చేసింది. ఇందులో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి. అయితే, ఈ మూడవ భాషకు బోర్డు పరీక్ష ఉండదు, కేవలం పాఠశాలల అంతర్గత మూల్యాంకనం మాత్రమే ఉంటుంది. దీనివల్ల విద్యార్థుల బోర్డు పరీక్షల అర్హతకు ఎలాంటి ఇబ్బంది కలగదు.
మరింత CBSE: ఎందుకు ఈ మూడు భాషల విధానం..? జూలై 1 నుంచే అమలు!Bandi Sanjay: సత్యమేవ జయతే.. చట్టం ముందు నా కొడుకైనా ఒకటే!
బండి భగీరథ్ కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. చట్టం ముందు తన కొడుకైనా, సామాన్యుడైనా ఒకటేనని స్పష్టం చేస్తూ.. కోర్టు ఆదేశాలు వచ్చే లోపే విచారణకు పూర్తిగా సహకరించడానికి న్యాయవాదుల ద్వారా పోలీసుల ముందుకు వెళ్లినట్లు తెలిపారు. తన కుమారుడు నిర్దోషి అని, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.
మరింత Bandi Sanjay: సత్యమేవ జయతే.. చట్టం ముందు నా కొడుకైనా ఒకటే!Bandi Bhagirath Arrested: బండి భగీరథ్.. లొంగిపోయాడా? అరెస్ట్ చేశారా?
పోక్సో కేసులో బండి భగీరథ్కు మేడ్చల్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయన్ను చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే ఆయన లొంగిపోయాడని బండి సంజయ్ అంటుండగా, తామే నార్సింగిలో అరెస్ట్ చేశామని సైబరాబాద్ సీపీ స్పష్టం చేశారు. తదుపరి దర్యాప్తు కోసం సిట్ పోలీసులు నిందితుడి కస్టడీని కోరే అవకాశం ఉంది.
మరింత Bandi Bhagirath Arrested: బండి భగీరథ్.. లొంగిపోయాడా? అరెస్ట్ చేశారా?