TRAI

TRAI: జియో, ఎయిర్ టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ లకు భారీ జరిమానా.. ఎందుకంటే..

TRAI: రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా – VI,  BSNL స్పామ్ కాల్‌లు,  మెసేజ్ లను  ఆపడంలో విఫలమైనందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే TRAI జరిమానా విధించింది. నాలుగు పెద్ద కంపెనీలతో పాటు, అనేక చిన్న టెలికాం ఆపరేటర్లకు కూడా TRAI జరిమానా విధించింది. టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్ – TCCCPR కింద అన్ని కంపెనీలకు TRAI ఈ జరిమానా విధించింది. తాజా రౌండ్‌లో, TRAI అన్ని కంపెనీలపై మొత్తం ₹ 12 కోట్ల జరిమానా విధించింది.

ఇది కూడా చదవండి: Chandrababu: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఇంతకు ముందు విధించిన జరిమానాలతో కలిపి, టెలికాం కంపెనీలపై మొత్తం జరిమానా ₹141 కోట్లు. అయితే ఈ బకాయిలను కంపెనీలు ఇంకా చెల్లించలేదు. కంపెనీల బ్యాంక్ గ్యారెంటీలను ఎన్‌క్యాష్ చేయడం ద్వారా డబ్బును తిరిగి పొందాలని TRAI డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ని కోరింది.  అయితే దీనిపై DoT నిర్ణయం ఇంకా పెండింగ్‌లో ఉంది.

TCCCPR 2010లో ఏర్పాటైంది. స్పామ్ కాల్‌లు, మెసేజ్ ల నుండి వినియోగదారులను రక్షించడం దీని ఉద్దేశ్యం. TCCCPR విధులు కస్టమర్‌లకు ప్రచార కంటెంట్‌ను బ్లాక్ చేయడానికి ఆప్షన్స్ అందించడం, టెలిమార్కెటర్‌ల కోసం రిజిస్ట్రేషన్, ప్రచార కమ్యూనికేషన్‌లపై సమయ పరిమితులు అలాగే  నిబంధనల ఉల్లంఘనలకు జరిమానాలు వంటివి ఉన్నాయి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Amitabh Bachchan: అల్లు అర్జున్‌పై అమితాబ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *