Supreme Court

Supreme Court: కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్య కేసులో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

Supreme Court: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ఆగస్టు 9న జరిగిన ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

సీబీఐ తాజా స్టేటస్ రిపోర్ట్‌పై 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరింది. అంతేకాకుండా, కేసు విచారణను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయడానికి కూడా కోర్టు నిరాకరించింది.

వైద్యుల భద్రతకు సంబంధించిన పిటిషన్‌పై, కేంద్ర ప్రభుత్వం నేషనల్ టాస్క్ ఫోర్స్ (ఎన్‌టిఎఫ్) నివేదికను దాఖలు చేసిందని న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఇది కూడా చదవండి: Supreme Court: బుల్‌డోజర్‌ చర్యలపై కోర్టు సీరియస్.. ఇళ్లను కూల్చడం అరాచకం..

Supreme Court: ఎన్టీఎఫ్ నివేదిక కాపీని కేసులో ఉన్న న్యాయవాదులందరికీ, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సూచన అమలు అయ్యిన తరువాత  పిటిషనర్లందరూ, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు దీనిపై తమ సూచనలు ఇవ్వాలి. ఇందుకు కోర్టు మూడు వారాల సమయం ఇచ్చింది.

అంతకుముందు నవంబర్ 4న, పశ్చిమ బెంగాల్‌లోని సీల్దా కోర్టు అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై అభియోగాలు మోపింది. నవంబర్ 11 నుంచి ప్రతిరోజూ ఈ కేసు విచారణకు రానుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Health Tips: రోజుకి ఒక్క గ్లాస్ తాగితే పొట్ట కరగాల్సిందే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *