Ktr: కేటీఆర్ క్యాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ..

Ktr: మాజీ మంత్రి కేటీఆర్‌పై హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. ఫార్ములా కార్‌ రేస్‌ కేసులో కేటీఆర్‌పై ప్రత్యేక ఆరోపణలపై హైకోర్టు చర్చ జరుపుతోంది.

అరోపణలు:

కేటీఆర్‌ మంత్రిగా తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణ.

రూ.10 కోట్లకు పైగా డబ్బులు చెల్లింపు జరగడంతో, ఆర్థిక శాఖ అనుమతి అవసరమని పేర్కొనడం జరిగింది.

ఎన్నికల కమిషన్‌ అనుమతి పొందకుండా నిధులను మంజూరు చేశారని మరో ఆరోపణ.

ప్రభుత్వ నిధులు తప్పుగా ఉపయోగించారని కేసు నమోదు చేశారు.

వాదనలు:

కేటీఆర్ తరపున లాయర్ సిద్ధార్థ్ దవే:

ఈ కేసులో వ్యక్తిగత లాభం ఎక్కడ ఉందని ప్రశ్నించారు.

అవినీతి నిరోధక చట్టం సెక్షన్లకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు లేవని వాదించారు.

కేసులో నిధులు పంపినట్లు ఆరోపణ చేసిన కంపెనీని పార్టీలుగా చేర్చలేదని తెలిపారు.

ప్రాసిక్యూషన్ వాదనలు:

నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు చెల్లించారని పేర్కొన్నారు.

అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద కేసు నమోదైందని స్పష్టం చేశారు.

ప్రజా ధనం దుర్వినియోగం జరిగిందని వివరించారు.

హైకోర్టు ప్రశ్నలు:

ఆరోపణలు ఏ మేరకు నిజమని నిలదీశారు.

ఇది అవినీతి లేదా వ్యక్తిగత లాభంతో కూడుకున్న చర్య కాదా అని విచారించారు.

ఈ కేసులో తదుపరి విచారణకు హైకోర్టు తేదీని నిర్ణయించనుంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Raja Singh: బీజేపీలో చేరే వారికి రాజా సింగ్ సూచన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *