AP News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకంగా నిలిచే పోర్టుల నిర్మాణంపై దృష్టిసారించింది. సముద్ర తీరం వెంట ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా సంబంధిత పరిశ్రమలు ఉండేలా మొత్తం 20 పోర్టులను అందుబాటులోకి తేవాలనే వ్యూహం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ గేట్వే పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి. వీటిని త్వరితగతిన పూర్తి చేసి 2026 నాటికి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలనే లక్ష్యం ప్రభుత్వం నిర్ధేశించింది.
