Pawan Kalyan: ఢిల్లీలో జనసేన నిర్వహిస్తోన్న మూడు రోజుల సభల తొలిరోజున పవన్ కల్యాణ్ మాట్లాడారు. వ్యక్తిగత లాభాలు, కురచ భావాల వల్లే ‘కాక్రోచ్ జనతా పార్టీలు’ వస్తాయని విమర్శించారు. చిన్న చీమలు సర్పంనైనా చంపేస్తాయన్న సుమతీ శతకాన్ని గుర్తుచేస్తూ.. చిన్న శక్తులు కలిస్తే బలమైన ప్రవాహం అవుతుందని, అందులో జనసేన చిక్కుకోకూడదని చెప్పారు. విభజనవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని, జనసేనకు దేశభక్తే కీలకమని స్పష్టం చేశారు.
మరింత Pawan Kalyan: కాక్రోచ్ పార్టీ పుట్టుకకు కారణం అదే.. జనసైనికులకు కీలక పిలుపు!Tag: Andhra Pradesh News
China: గుంటూరు మిర్చికి చైనా ‘రెడ్ సిగ్నల్’.. పెరిగిన పురుగుమందుల అవశేషాలు..!
Guntur Mirchi: గుంటూరు నుంచి పంపిన మిర్చి కంటైనర్లలో ప్రమాదకర పురుగుమందుల (మెథామిడోఫాస్) అవశేషాలు పరిమితికి మించి ఉన్నాయని చైనా మూడు కన్సైన్మెంట్లను తిరస్కరించింది. ముగ్గురు భారతీయ ఎగుమతిదారులపై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. దీనివల్ల ‘తేజ’ రకం మిర్చి ఎగుమతులు నిలిచిపోగా, స్పైసెస్ బోర్డ్ మరియు ఉద్యానవన శాఖ అధికారులు నాణ్యత నియంత్రణ చర్యలపై గుంటూరులో అత్యవసర సమీక్షలు నిర్వహిస్తున్నారు.
మరింత China: గుంటూరు మిర్చికి చైనా ‘రెడ్ సిగ్నల్’.. పెరిగిన పురుగుమందుల అవశేషాలు..!Pawan Kalyan: అధికారం కోసం పార్టీ పెట్టలేదు.. దేశ సమగ్రతను కాపాడటమే జనసేన లక్ష్యం!
Pawan Kalyan: జనసేన పార్టీ స్థాపించి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో జరిగిన ప్రజాప్రతినిధుల సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. తాము అధికారం కోసం పార్టీ పెట్టలేదని, దేశ సమగ్రత, దేశభక్తే జనసేన లక్ష్యాలని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల మంది జనసైనికులు ఉన్నారన్న ఆయన, తెలంగాణ ఏర్పాటుపై వ్యతిరేకత లేదని, కాంగ్రెస్ విభజించిన తీరునే తప్పుపట్టారు. హైదరాబాద్లో సభకు పర్మిషన్ ఇవ్వనందుకే, జనసేన జాతీయవాదాన్ని వినిపించడానికి ఢిల్లీని వేదికగా ఎంచుకున్నట్లు వివరించారు.
మరింత Pawan Kalyan: అధికారం కోసం పార్టీ పెట్టలేదు.. దేశ సమగ్రతను కాపాడటమే జనసేన లక్ష్యం!Pawan Kalyan: హైదరాబాద్లో నో-పర్మిషన్ వివాదం తర్వాత.. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ‘సేన ప్రస్థానం’.!
Pawan Kalyan: హైదరాబాద్లో జనసేన సభకు తెలంగాణ పోలీసులు పర్మిషన్ నిరాకరించిన వివాదం తర్వాత, పవన్ కళ్యాణ్ ఢిల్లీలో జూన్ 14-16 వరకు ‘సేన ప్రస్థానం’ పేరిట మూడు రోజుల జాతీయ ఔట్రీచ్ ప్రోగ్రామ్ చేపట్టారు. సోమవారం పార్టీ ప్రజాప్రతినిధులు, దక్షిణాది నేతలతో కీలక భేటీ జరగనుంది. 2028 తెలంగాణ ఎన్నికల్లో పోటీ, నేషనల్ ఇంటిగ్రేషన్ మరియు ప్రతిష్టాత్మక “సేన గర్జన” కార్యక్రమ వ్యూహాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు.
మరింత Pawan Kalyan: హైదరాబాద్లో నో-పర్మిషన్ వివాదం తర్వాత.. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ‘సేన ప్రస్థానం’.!Chandrababu: సింగపూర్లో సీఎం చంద్రబాబు పెట్టుబడుల వేట.. ప్రధానితో సహా కీలక నేతలతో భేటీ..!
Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ మరియు పలువురు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. అమరావతి నగర ప్రణాళిక, చిప్ తయారీ, నౌకా నిర్మాణం వంటి రంగాలలో పెట్టుబడుల కోసం సింగపూర్ సంస్థలను ఆహ్వానించారు. వరల్డ్ సిటీస్ సదస్సులో పాల్గొనడంతో పాటు సుర్బానా జురాంగ్ ప్రతినిధులతో అమరావతిపై సమీక్ష నిర్వహించనున్నారు.
మరింత Chandrababu: సింగపూర్లో సీఎం చంద్రబాబు పెట్టుబడుల వేట.. ప్రధానితో సహా కీలక నేతలతో భేటీ..!Kesineni Nani: ఈడీకి లేఖ రాయడంతో ముదిరిన వివాదం.. ఎంపీ కేశినేని చిన్ని ఫిర్యాదుతో యాక్షన్!
Kesineni Nani: ఎంపీ కేశినేని చిన్నిపై సంచలన ఆరోపణలు చేస్తూ మాజీ ఎంపీ కేశినేని నాని ఈడీకి లేఖ రాయడం, ఉర్సా క్లస్టర్స్ అంశంపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయడంతో విజయవాడ కేశినేని బ్రదర్స్ వివాదం ముదిరింది. లీగల్ నోటీసులు ఇచ్చినా దుష్ప్రచారం ఆపలేదంటూ చిన్ని ఇచ్చిన ఫిర్యాదుతో నానిపై పోలీసులు BNS, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.
మరింత Kesineni Nani: ఈడీకి లేఖ రాయడంతో ముదిరిన వివాదం.. ఎంపీ కేశినేని చిన్ని ఫిర్యాదుతో యాక్షన్!Chandrababu: అమరావతిని ఎవరూ ఆపలేరు.. చర్చకు మేం సిద్ధం!
Chandrababu: కూటమి రెండేళ్ల పాలన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ ఐదేళ్ల విధ్వంస పాలన వల్ల కుప్పకూలిన వ్యవస్థలను తాము బాగు చేస్తున్నామన్నారు. తిరుమలను అపవిత్రం చేసిన వారు అనుభవిస్తారన్నారు. రాయలసీమను రూ. లక్ష కోట్లతో బంగారు సీమగా మారుస్తామని.. పుట్టపర్తిలో 5th జనరేషన్ ఫైటర్ జెట్ ప్లాంట్, తిరుపతిలో రూ. 2,500 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఫ్యాక్టరీ వస్తున్నాయని ప్రకటించారు. వచ్చే నెలలో సీమ స్టీల్ ప్లాంట్ తెరుస్తామన్నారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని, 15,700 పోస్టుల డీఎస్సీ పూర్తి చేశామని స్పష్టం చేస్తూ.. హామీల అమలుపై వైసీపీతో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
మరింత Chandrababu: అమరావతిని ఎవరూ ఆపలేరు.. చర్చకు మేం సిద్ధం!Pawan Kalyan: కూటమి కృషి వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది
Pawan Kalyan: కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే నాడు తాను 21 సీట్లు తీసుకున్నానని, కూటమి కృషి వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని చెప్పారు. రాష్ట్రం కులాల పరిమితులు దాటి భారతీయత వైపు వెళ్లాలని పిలుపునిచ్చారు. అలాగే, దేశ ప్రగతి గ్రామాల్లోనే నిర్ణయించబడుతుందని, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి, ఇచ్చిన ప్రతి హామీ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
మరింత Pawan Kalyan: కూటమి కృషి వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందిNara Lokesh: మనది ఫైటర్ జెట్.. వాళ్లది ఫ్యాక్షన్.. రెడ్ బుక్ దాని పని అది చేసుకుపోతుంది!
Nara Lokesh: తిరుపతి కూటమి సభలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. రెండేళ్ల పాలనలో దాడులు, బూతులు లేని స్వేచ్ఛా వాతావరణం కల్పించామన్నారు. దేవుడితో పెట్టుకున్నందుకే జగన్కు ఈ గతి పట్టిందన్నారు. కూటమిది క్రెడిబిలిటీ అయితే వైసీపీది క్రిమినాలిటీ అని.. కియా తెచ్చిన ఘనత బాబుదైతే, కిడ్నాప్లు చేసింది వైసీపీ అని మండిపడ్డారు. చంద్రబాబు సీమను రత్నాల సీమగా మార్చారని చెబుతూ.. అరాచకాలకు పాల్పడితే ‘రెడ్ బుక్’ తన పని తాను చేసుకుపోతుందని లోకేశ్ హెచ్చరించారు.
మరింత Nara Lokesh: మనది ఫైటర్ జెట్.. వాళ్లది ఫ్యాక్షన్.. రెడ్ బుక్ దాని పని అది చేసుకుపోతుంది!Kona Shashidhar: మెగా డీఎస్సీ వంద శాతం పారదర్శకం.. లీకేజీకి ఆస్కారమే లేదు!
Kona Shashidhar: మెగా డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. టీసీఎస్ అయాన్ ద్వారా 42 వేల ప్రశ్నల బ్యాంక్తో, రోజువారీ పాస్వర్డ్లు మారుస్తూ పరీక్షలు జరిపామన్నారు. టెట్ 20%, డీఎస్సీ 80% వెయిటేజీతో మెరిట్ లిస్ట్ ఇచ్చామని.. 1:1 కాల్లెటర్ వస్తే ఉద్యోగం ఖాయం కాదన్నారు. ఫస్ట్ ర్యాంకర్ నవీన్ వెరిఫికేషన్కు రానందున ఉద్యోగం ఇవ్వలేమన్నారు. సందేహాల కోసం స్పెషల్ సెల్ ఏర్పాటు చేశామని, త్వరలో మరో డీఎస్సీ ఉంటుందని వెల్లడించారు.
మరింత Kona Shashidhar: మెగా డీఎస్సీ వంద శాతం పారదర్శకం.. లీకేజీకి ఆస్కారమే లేదు!