AP SSC Supplementary Results: ఏపీ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా వీటిని ప్రకటించారు. ఈసారి మొత్తం 94,990 మందిలో 78,261 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే పాస్ పర్సంటేజ్ 6.25% పెరిగింది. ప్రభుత్వ ’20 రోజుల యాక్షన్ ప్లాన్’ వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్ లేదా 95523 00009 నంబర్ ద్వారా వాట్సాప్లోనే తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలు పొందవచ్చు.
మరింత AP SSC Supplementary Results: ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈసారి 6.25% పెరిగిన పాస్ పర్సంటేజ్..Tag: Andhra Pradesh News
Vijayawada: సాయికృష్ణ కేసులో సంచలనం.. కృష్ణలంక సీఐ నాగరాజుపై ‘మర్డర్’ కేసు నమోదు
Vijayawada: విజయవాడ రౌడీషీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కృష్ణలంక సీఐ నాగరాజుపై మర్డర్ కేసు నమోదైంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదును సీపీ రాజశేఖర్బాబు స్వయంగా స్వీకరించి, సీఐపై BNS సెక్షన్లు 101(1), 127(4), 127(6) కింద కేసు నమోదు చేయించారు. ఈ లాకప్ డెత్ ఆరోపణల కేసు విచారణ అధికారిగా దిశా పీఎస్ ఏసీపీ దైవ ప్రసాద్ నియమితులయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు దర్యాప్తు వేగవంతమైంది.
మరింత Vijayawada: సాయికృష్ణ కేసులో సంచలనం.. కృష్ణలంక సీఐ నాగరాజుపై ‘మర్డర్’ కేసు నమోదుKodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్కు అనుమతి
Kodali Nani: 2021 పంచాయతీ ఎన్నికల సమయంలో చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో వైకాపా నేత కొడాలి నానిపై ప్రాసిక్యూషన్కు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ సమయంలో ఆయన మంత్రిగా ఉన్నందున విచారణకు ప్రభుత్వ పర్మిషన్ అవసరమవడంతో మూడేళ్లుగా ఈ కేసు పెండింగ్లో ఉంది. తాజాగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అనుమతి ఉత్తర్వులు జారీ చేయడంతో కోర్టులో విచారణ ముందుకు సాగనుంది.
మరింత Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్కు అనుమతిKakinada Child Missing: 500 ఎకరాలు.. థర్మల్ డ్రోన్లు.. 400 మంది సిబ్బంది! తండ్రి విచారణ.. క్లూ ఇస్తుందనుకున్న పెంపుడు కుక్క మృతి!
Kakinada Child Missing: కాకినాడ జిల్లాలో రెండేళ్ల జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు మిస్టరీగా మారింది. తోటలోకి వెళ్లిన పాప కోసం 400 మంది సిబ్బంది, థర్మల్ డ్రోన్లతో 500 ఎకరాల్లో గాలిస్తున్నారు. పాపతో పాటు ఉండి, తిరిగి వచ్చిన పెంపుడు కుక్క కూడా అనుకోకుండా మృతి చెందడం కేసును సందిగ్ధంలో పడేసింది. కుటుంబ కలహాల కోణంలో తండ్రిని విచారిస్తున్న పోలీసులు, జంతువుల దాడి అనుమానంతో స్పై కెమెరాల బొమ్మలను కూడా ఏర్పాటు చేశారు.
మరింత Kakinada Child Missing: 500 ఎకరాలు.. థర్మల్ డ్రోన్లు.. 400 మంది సిబ్బంది! తండ్రి విచారణ.. క్లూ ఇస్తుందనుకున్న పెంపుడు కుక్క మృతి!ED Arrest: వైసీపీ మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్ను అరెస్ట్ చేసిన ఈడీ!
ED Arrest: ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం రవాణా కుంభకోణం (AP Liquor Transport Scant) కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ (ED) కీలక చర్య తీసుకుంది.
మరింత ED Arrest: వైసీపీ మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్ను అరెస్ట్ చేసిన ఈడీ!Sai Krishna: కృష్ణలంక సీఐ నాగరాజు సస్పెన్షన్.. రంగంలోకి ఐపీఎస్ అధికారి!
Sai Krishna: విజయవాడకు చెందిన సాయికృష్ణ మిస్సింగ్ కేసును ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జరిపిన సమీక్ష అనంతరం కృష్ణలంక సీఐ నాగరాజును సస్పెండ్ చేశారు. పోలీసులే తన కొడుకును చంపేశారని సాయికృష్ణ తల్లి ఆరోపిస్తూ, పీఎస్ సీసీ ఫుటేజ్ భద్రపరచాలని కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఈ కేసు విచారణను ఐపీఎస్ అధికారి, రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్కు అప్పగించింది.
మరింత Sai Krishna: కృష్ణలంక సీఐ నాగరాజు సస్పెన్షన్.. రంగంలోకి ఐపీఎస్ అధికారి!Pawan Kalyan: అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan: అరుదైన ‘డ్యూచెన్ మస్кулярర్ డిస్ట్రోఫీ’ వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల అభిమాని నిరంజన్ను పరామర్శించడానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హన్మకొండలోని ఆయన నివాసానికి స్వయంగా వచ్చి 40 నిమిషాలు గడిపారు. బాబు వైద్య ఖర్చులకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించడంతో పాటు శ్రీవారి శేషవస్త్రంతో ఆశీర్వదించారు. ఆ కుటుంబం కోసం క్యాంటీన్ ఏర్పాటు చేయాలని జనసేన నేతలను ఆదేశించిన పవన్, అనంతరం భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
మరింత Pawan Kalyan: అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్Pawan Kalyan: ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ‘సూపర్ హిట్’ టూర్.. ఏపీ అటవీ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!
Pawan Kalyan: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్తో భేటీ అయి 7 కీలక ప్రతిపాదనలకు ఆమోదం సాధించారు. ఏనుగుల దాడి నివారణకు ‘హనుమాన్ సెంటర్’, టైగర్ రిజర్వ్ రక్షణకు 150 బేస్ క్యాంప్లు, 300 మంది చెంచు యువతకు ఉద్యోగాలు, ఎంపీ మరియు మహారాష్ట్రల నుండి 50 బోదెద్దులు, 6 పులుల తరలింపునకు అనుమతులు లభించాయి. అలాగే కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, సీఆర్ పాటిల్లను కలిసి ఉపాధి హామీ నిధులు, గోదావరి ప్రక్షాళన, సూరత్ నీటి నిర్వహణ నమూనా అమలుపై చర్చించారు.
మరింత Pawan Kalyan: ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ‘సూపర్ హిట్’ టూర్.. ఏపీ అటవీ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!Chandrababu: సింగపూర్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు నాయుడు ‘ఏఐ & అమరావతి’ రోడ్మ్యాప్..!
Chandrababu: సింగపూర్ ‘వరల్డ్ సిటీస్ సమ్మిట్’లో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి విజన్ను ప్రకటించారు. నాడు సైబరాబాద్లో ఎకరం రూ.2 లక్షల నుండి నేడు రూ.200 కోట్లకు పెరగడమే సంపద సృష్టికి నిదర్శనమన్నారు. ఒకే పిలుపుతో 35 వేల ఎకరాలిచ్చిన అమరావతి రైతులను అభినందిస్తూ.. 21 కి.మీ వాటర్ ఫ్రంట్, క్వాంటం కంప్యూటింగ్ హబ్, నెట్ జీరో లక్ష్యాలతో అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మిస్తున్నామని తెలిపి, పెట్టుబడిదారులను ఆహ్వానించారు.
మరింత Chandrababu: సింగపూర్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు నాయుడు ‘ఏఐ & అమరావతి’ రోడ్మ్యాప్..!Pawan Kalyan: మోడీకి అందుకే మద్దతిస్తున్న.. భద్రత లేని జీవితాలు వృధా
Pawan Kalyan: ముంబై 26/11 దాడుల సమయంలో దేశానికి ఒక బలమైన నాయకుడు కావాలని వారణాసిలో తన తండ్రి అస్తికలు నిమజ్జనం చేసేటప్పుడు కాశీ విశ్వనాథుడిని మొక్కుకున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు ఒక గొప్ప నాయకుడిని పుట్టించే శక్తి భారతదేశానికి ఉందన్న నాని పాల్కీవాలా మాటలను గుర్తుచేస్తూ.. కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షల రూపమే నరేంద్ర మోదీ అని చెప్పారు. అభివృద్ధి కంటే దేశ భద్రతే ముఖ్యమని, అందుకే తమ సదస్సులో మోదీని అభినందిస్తూ మొదటి తీర్మానం పెట్టామని స్పష్టం చేశారు.
మరింత Pawan Kalyan: మోడీకి అందుకే మద్దతిస్తున్న.. భద్రత లేని జీవితాలు వృధా