Supreme court: వైద్య ప్రకటనలపై సుప్రీంకోర్టు షాకింగ్ డిసిషన్..

Supreme court: నకిలీ, తప్పుదారి పట్టించే వైద్య ప్రకటనలపై సుప్రీంకోర్ట్ తీవ్రంగా స్పందించింది. వాటిని నియంత్రించడంలో విఫలమైనందుకు వివరణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, జమ్మూకాశ్మీర్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

సుప్రీం నోటీసుల వివరాలు:

వైద్య ప్రకటనల నియంత్రణలో చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు పంపింది.మార్చి 7న జరిగే విచారణకు వర్చువల్‌గా హాజరుకావాలని ఆదేశించింది.ఈ కేసును ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారిస్తోంది.

తప్పుదారి పట్టించే ప్రకటనలపై ఆందోళన

కొన్ని ఆసుపత్రులు, వైద్యులు, ఆయుర్వేద, హోమియోపథీ ప్రాక్టీషనర్లు ఆరోగ్య సమస్యల గురించి తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మోసగిస్తున్నారు. లైసెన్స్ లేని వ్యక్తులు, అనుమతి లేకుండా నకిలీ మందులు విక్రయించడం, శాశ్వత వైద్య పరిష్కారాల పేరుతో నిరాధారమైన హామీలు ఇవ్వడం లాంటి సమస్యలు పెరిగిపోతున్నాయి.

IMA దాఖలు చేసిన పిటిషన్‌

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మెడికల్ ఎథిక్స్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ తప్పుడు ప్రకటనలను అరికట్టాలని, ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవాలని కోరింది.

ప్రభుత్వాల బాధ్యతపై ప్రశ్నలు

సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు ఈ సమస్యను నివారించడంలో ఎందుకు విఫలమయ్యాయని ప్రశ్నించింది. ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు కఠిన చట్టాలను అమలు చేయాలని స్పష్టం చేసింది.మార్చి 7న జరగబోయే ఈ విచారణలో ప్రభుత్వాలు ఏ విధమైనవివరణ ఇస్తాయో చూడాలి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ahmedabad Plane Crash: విమాన ప్రమాదంలో 274కు చేరిన మృతులు.. దర్యాప్తునకు హైలెవెల్ కమిటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *