Delhi:డిసెంబర్ 2కి రాజ్య సభ వాయిదా

Delhi: గత నాలుగు రోజులుగా అదానీ అంశంపై పార్లమెంట్ అట్టుడుకుతుంది. శీతాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి ప్రధాని అంశంపై చర్చ జరపాలని విపక్షాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. సభలో చర్చకు పట్టుబడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. దీంతో పార్లమెంట్‌ ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

గత మూడు రోజులుగా ఎగువ, దిగువ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నాలుగోరోజైన శుక్రవారం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు మొదలవ్వగానే ఎగువ సభలో ప్రతిపక్ష ఎంపీల నిరంతర నినాదాలతో సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ సభ్యుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లోక్‌సభ మధ్యాహ్నం 12 వరకూ వాయిదా పడగా.. రాజ్యసభ ఏకంగా డిసెంబర్ 2కి వాయిదా పడింది. చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *