Nara lokesh: ప్రభుత్వ పాఠశాలపై ప్రజల నమ్మకానికి నిదర్శనం ఆదోని స్కూల్‌

Nara lokesh: ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెరుగుతున్నదానికి తాజాగా ఒక ఉదాహరణ ఆదోనిలో కనిపించింది. ఒకప్పుడు చిన్నచూపు చూసే స్థితిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ఇప్పుడు అధిక సంఖ్యలో విద్యార్థులు చేరే స్థాయికి ఎదిగాయి. కర్నూలు జిల్లా ఆదోనిలోని మున్సిపల్ నెహ్రూ మెమోరియల్ హైస్కూల్‌‌ పరిస్థితి ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఈ స్కూల్‌లో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలు పూర్తయ్యాయి. దీంతో పాఠశాల యాజమాన్యం “నో అడ్మిషన్” అనే బోర్డును వేశారు. ఇప్పటికే పాఠశాల సామర్థ్యాన్ని మించి విద్యార్థులు చేరారు. ప్రస్తుతం 1,725 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో ఈ ఏడాద aloneలోనే 400 మందికి పైగా కొత్త అడ్మిషన్లు ఇచ్చారు. మరిన్ని అడ్మిషన్లకు వీలులేకపోవడంతో బోర్డు వేయాల్సి వచ్చింది.

ఈ అంశంపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. “నో అడ్మిషన్ బోర్డు చూసి చాలా ఆనందించాను. ప్రజల్లో ప్రభుత్వ విద్యపై పెరిగిన నమ్మకానికి ఇది నిదర్శనం. అడ్మిషన్లు ముగిశాయని చెప్పినా, ‘మా పిల్లాడినైనా చేర్చండి సార్‌’ అంటూ తల్లిదండ్రులు బతిమాలుతున్నారని ప్రధానోపాధ్యాయుడు ఫయాజుద్దీన్ చెప్పడం ఎంతో గర్వకారణం” అని అన్నారు.

పాఠశాల ఉపాధ్యాయుల కృషికి మంత్రి లోకేశ్ కితాబు ఇచ్చారు. ప్రధానోపాధ్యాయుడు ఫయాజుద్దీన్‌తో పాటు, ఉపాధ్యాయ సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. “ప్రతి ప్రభుత్వ పాఠశాల వద్ద ఇలాంటి బోర్డులు కనపడే రోజులు రావాలి. ఉపాధ్యాయులే ‘ఏపీ మోడల్ ఎడ్యుకేషన్‌’కి మూలస్తంభం” అని మంత్రి పేర్కొన్నారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Priyadarshi: "ప్రేమంటే" ఏమిటో చెప్పబోతున్న ప్రియదర్శి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *