Jatadhara : సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘జటాధర’ సినీ ప్రియుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ అదిరిపోయేలా ఉండటంతో అందరిలోనూ ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్తో ఈ మూవీని రూపొందిస్తున్నారు మేకర్స్.
అయితే, ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా తొలిసారి టాలీవుడ్లో అడుగుపెడుతోంది. ఇప్పటికే షూటింగ్లో బిజీగా ఉన్న ఆమె.. తాజాగా ఓ సూపర్ అప్డేట్ షేర్ చేసింది.‘జటాధర’లో తన పాత్ర షూటింగ్ పూర్తయిందని, ఈ సినిమా షూట్ను విజయవంతంగా ముగించానని సోనాక్షి ఇన్స్టాలో పోస్ట్ చేసింది.
Also Read: Odela 2: ఓదెల 2: OTT పార్ట్నర్ లాక్!
Jatadhara : తన క్యారెక్టర్ అద్భుతంగా ఉందని, తొలి తెలుగు సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. ఈ సినిమాతో టాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని సోనాక్షి ప్లాన్ చేస్తోంది. వెంకట్ కళ్యాణ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శివిన్ నారంగ్, ప్రేరణ అరోరా, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ కలిసి నిర్మిస్తున్నారు. సుధీర్-సోనాక్షి జోడీ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి!