Vijayawada: మద్యం ప్రియులకు షాక్.. ఆ నగరంలో ఆంక్షలు

Vijayawada: విజయవాడ నగరంలో నూతన సంవత్సరం సంబరాల నేపథ్యంలో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. రోడ్డు భద్రత, ప్రజల సౌకర్యం దృష్ట్యా ట్రాఫిక్‌ పరిమితులు విధించారు. డిసెంబర్‌ 31 రాత్రి పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు.

బెంజ్ సర్కిల్, కనకదుర్గ ఫ్లైఓవర్‌లపై రాత్రి 10 గంటల తర్వాత ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయనున్నారు. అలాగే బందర్ రోడ్, ఏలూరు రోడ్, బీఆర్‌టీఎస్ రోడ్లపై వాహన చలనం మీద పర్యవేక్షణ ఉంచనున్నారు. పశ్చిమ బైపాస్ రోడ్డును కూడా ఈ సమయానికి మూసివేస్తున్నారు.

సురక్షిత వేడుకల కోసం యువత నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారికి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రజలు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఈ ఆంక్షలు అమలు చేయాలని పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఫ్లైఓవర్ల మూసివేతతో పాటు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్‌లు నివారించేందుకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ప్రజలందరూ పోలీసుల సహకారం అందించి వేడుకలను సురక్షితంగా నిర్వహించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. చట్టానికి లోబడి, నిబంధనలను పాటిస్తే ప్రతి ఒక్కరికీ ఈ కొత్త సంవత్సరం ఆనందదాయకంగా ఉండనుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Bandi sanjay: మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *