Nara Lokesh

Nara Lokesh: పంజాబ్ పర్యటనలో లోకేశ్ దంపతులు – స్వర్ణదేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కుటుంబంతో కలిసి పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పర్యటించారు. ఈ సందర్బంగా, వారు ప్రపంచ ప్రసిద్ధి పొందిన స్వర్ణదేవాలయాన్ని సందర్శించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హర్‌మందిర్ సాహిబ్‌ను దర్శించడం ఎంతో పవిత్రమైన అనుభూతి కలిగించిందని లోకేశ్ తెలిపారు.

సతీమణి నందమూరి బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ్‌తో కలిసి స్వర్ణదేవాలయంలోని ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించిన లోకేశ్, ఈ పవిత్ర క్షేత్రం తన మనసుకు ఎంతో శాంతిని అందించిందని వెల్లడించారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు.

ఈ యాత్రలో ఆయన కుటుంబ సభ్యులతో పాటు కొందరు సన్నిహితులు కూడా పాల్గొన్నారు. అనంతరం, దేవాలయ పరిసరాల్లో కొంత సమయం గడిపి అక్కడి భక్తులతో కలిసి భక్తిభావంతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Also Read: Visakha Beach: విశాఖ బీచ్ లో కొట్టుకుపోతున్న విదేశీయులను కాపాడిన మెరైన్ సిబ్బంది

Nara Lokesh: స్వర్ణదేవాలయం సందర్శన సందర్భంగా తీసుకున్న ఫోటోలను లోకేశ్ తన ‘ఎక్స్’ (మాజీ ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు. “హర్‌మందిర్ సాహిబ్‌ను దర్శించుకొని అందరికీ సుఖశాంతులు కలగాలని ప్రార్థించాం” అని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆయన షేర్ చేసిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన లోకేశ్, ఇటీవలే తన కుటుంబంతో కొంత సమయం గడపాలని భావించి ఈ యాత్రకు వెళ్లినట్లు సమాచారం. రాజకీయాలతో పాటు కుటుంబానికి సమయం కేటాయించడం కూడా ఎంతో ముఖ్యమని ఆయన చెబుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Nara Lokesh: డిప్యూటీ సీఎం అంశంపై మ‌రోసారి స్పందించిన నారా లోకేశ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *