Jeevan Reddy: పదేళ్లు దోచుకున్నోడి మాటే వింటారా?

Jeevan Reddy: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రవర్తనపై పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తూ, సంవత్సరాలుగా కష్టపడుతున్న నాయకులను విస్మరిస్తున్నారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అంశంపై జీవన్ రెడ్డి నేరుగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ – “వలస వచ్చిన వాళ్లు చెబితేనే పనులు చేస్తారా? పాత కాంగ్రెస్ నాయకులు చెబితే ఎందుకు వినడం లేదు?” అంటూ మంత్రిని ప్రశ్నించారు.

జీవన్ రెడ్డి మరింత ఘాటుగా మాట్లాడుతూ, “ఆయనకు పదేళ్లు దోచుకున్న అనుభవం ఉంది, అందుకే ఆయన మాటలే వింటారా?” అంటూ సంజయ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ ఫిరాయించిన వారికి ఇంత ప్రాధాన్యత ఇవ్వడం కాంగ్రెస్‌ సిద్ధాంతాలకు విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు.

“పార్టీని మొదటి నుంచి నమ్మి కష్టపడుతున్న మా లాంటి వారిని పట్టించుకోకపోవడం బాధాకరం. కొత్తగా వచ్చిన వారికే పదవులు, అవకాశాలు ఇస్తున్నారు. ఇది కాంగ్రెస్ విలువలకు తగదు” అని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇలాంటి అంతర్గత విభేదాలు వెలుగులోకి రావడంతో, ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *