jaishankar

S. Jaishankar: యూఎస్ లో ట్రంప్ విజయంపై భారత్ కు ఆందోళన లేదు

S. Jaishankar: ట్రంప్‌ విజయం తర్వాత భారత్‌-అమెరికా సంబంధాలపై విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ తొలిసారిగా స్పందించారు. ట్రంప్ విజయంపై ప్రపంచంలోని అనేక దేశాలు ఆందోళన చెందుతున్నాయని, అయితే ట్రంప్ మళ్లీ అధ్యక్షుడు అయినందుకు భారత్ ఆందోళన చెందడం లేదని ఆయన అన్నారు.

ముంబైలో ఆదిత్య బిర్లా గ్రూప్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ సిల్వర్ జూబ్లీ ఈవెంట్‌కు జైశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ట్రంప్ విజయం సాధించిన తర్వాత మాట్లాడిన తొలి ముగ్గురు ప్రపంచ నాయకులలో మోదీ ఒకరు.

ఇది కూడా చదవండి: Pakistan: పాకిస్థాన్‌లో కోర్టు మెట్లెక్కిన మూడేండ్ల చిన్నారి

S. Jaishankar: ప్రధాని మోదీకి చాలా మంది అమెరికా అధ్యక్షులతో బలమైన వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని జైశంకర్ అన్నారు. మోదీ  వాషింగ్టన్ డిసికి వెళ్ళినప్పుడు, అక్కడ అధ్యక్షుడు ఒబామా, తరువాత డొనాల్డ్ ట్రంప్, తరువాత జో బిడెన్ ఉన్నారు. ఇది ఆయనకు  చాలా సహజమైనది. ప్రధాని మోదీ  ప్రపంచ నాయకులతో బలమైన వ్యక్తిగత సంబంధాలను ఏర్పరుస్తారు. ఇది భారతదేశానికి సహాయపడుతుంది అని మంత్రి జై శంకర్ పేర్కొన్నారు. 

నవంబర్ 5న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌పై విజయం సాధించారు. 50 రాష్ట్రాల్లోని 538 స్థానాలకు గానూ 312 స్థానాల్లో ట్రంప్ విజయం సాధించారు. 2016 నుంచి 2020 వరకు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  North India: ఉత్తరభారతాన్ని వణికిస్తున్న చలి పులి...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *