Delhi: కేంద్ర మంత్రివర్గం నేడు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.
✈️ కోటా-బురిడీ (రాజస్థాన్) గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్
కోటా విమానాశ్రయం నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది.
440.06 హెక్టార్ల భూమిపై ఈ ఎయిర్పోర్ట్ నిర్మించనున్నారు.
మొత్తం వ్యయం రూ.1507 కోట్లు కేటాయించారు.
ఈ ప్రాజెక్టు పూర్తి అయితే, రాజస్థాన్లో రవాణా, పర్యాటక రంగాలకు ఊతమివ్వనుంది.
🛣️ ఒడిశా – కటక్-భువనేశ్వర్ రింగ్ రోడ్
భువనేశ్వర్ నగర పరిసరాల్లో రింగ్ రోడ్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
6 లేన్ల ఈ రింగ్ రోడ్ కోసం రూ.8307 కోట్లు కేటాయించారు.
కటక్-భువనేశ్వర్ మధ్య ట్రాఫిక్ రద్దీ తగ్గించడమే లక్ష్యం.
ఈ రహదారి నిర్మాణం పూర్తయితే, ఒడిశా రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడనుంది.
👉 ఈ నిర్ణయాలు దేశంలోని రవాణా, మౌలిక వసతుల అభివృద్ధికి దోహదం చేయనున్నాయని కేంద్రం పేర్కొంది.