Kishan Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మెట్రో ఫేజ్-1కు కేంద్రం రూ.1200 కోట్లు ఇచ్చిందని చెప్తూ.. మెట్రోపై బురదజల్లే ప్రయత్నం సరికాదన్నారు. తాము రేవంత్కు కాకుండా తెలంగాణ ప్రజలకు జవాబుదారీ అని స్పష్టం చేశారు. రూ.13 వేల కోట్ల IRFC లోన్ పెండింగ్కు పలు కారణాలు ఉన్నాయని, దీనిపై కేంద్ర, రాష్ట్ర అధికారులు కలిసి చర్చించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.
మరింత Kishan Reddy: మెట్రో రైలుపై బురదజల్లడం ఆపండి.. మేము సీఎంకు కాదు, ప్రజలకే జవాబుదారీ!Category: News
Pawan Kalyan: ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ‘సూపర్ హిట్’ టూర్.. ఏపీ అటవీ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!
Pawan Kalyan: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్తో భేటీ అయి 7 కీలక ప్రతిపాదనలకు ఆమోదం సాధించారు. ఏనుగుల దాడి నివారణకు ‘హనుమాన్ సెంటర్’, టైగర్ రిజర్వ్ రక్షణకు 150 బేస్ క్యాంప్లు, 300 మంది చెంచు యువతకు ఉద్యోగాలు, ఎంపీ మరియు మహారాష్ట్రల నుండి 50 బోదెద్దులు, 6 పులుల తరలింపునకు అనుమతులు లభించాయి. అలాగే కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, సీఆర్ పాటిల్లను కలిసి ఉపాధి హామీ నిధులు, గోదావరి ప్రక్షాళన, సూరత్ నీటి నిర్వహణ నమూనా అమలుపై చర్చించారు.
మరింత Pawan Kalyan: ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ‘సూపర్ హిట్’ టూర్.. ఏపీ అటవీ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!Chandrababu: సింగపూర్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు నాయుడు ‘ఏఐ & అమరావతి’ రోడ్మ్యాప్..!
Chandrababu: సింగపూర్ ‘వరల్డ్ సిటీస్ సమ్మిట్’లో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి విజన్ను ప్రకటించారు. నాడు సైబరాబాద్లో ఎకరం రూ.2 లక్షల నుండి నేడు రూ.200 కోట్లకు పెరగడమే సంపద సృష్టికి నిదర్శనమన్నారు. ఒకే పిలుపుతో 35 వేల ఎకరాలిచ్చిన అమరావతి రైతులను అభినందిస్తూ.. 21 కి.మీ వాటర్ ఫ్రంట్, క్వాంటం కంప్యూటింగ్ హబ్, నెట్ జీరో లక్ష్యాలతో అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మిస్తున్నామని తెలిపి, పెట్టుబడిదారులను ఆహ్వానించారు.
మరింత Chandrababu: సింగపూర్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు నాయుడు ‘ఏఐ & అమరావతి’ రోడ్మ్యాప్..!CM Vijay: సీఎం విజయ్ దసరా కానుక.. 14 లక్షల మంది రైతులకు బంపర్ బెనిఫిట్!
CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ సహకార బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ నిబంధనలు సవరిస్తూ గుడ్ న్యూస్ చెప్పారు. రూ.75,000 వరకు అప్పు ఉన్న సన్న, చిన్న, పెద్ద రైతులకు పూర్తి రుణమాఫీ చేయనుండగా.. అంతకంటే ఎక్కువ ఉన్న వారికి రూ.35,000 చొప్పున మాఫీ చేయనున్నారు. రైతుల నిరసనలతో సచివాలయంలో జరిగిన సమీక్షలో ఈ మార్పులు చేశారు. దీనివల్ల 14.43 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుండగా, ప్రభుత్వంపై రూ.5,932 కోట్ల అదనపు భారం పడనుంది.
మరింత CM Vijay: సీఎం విజయ్ దసరా కానుక.. 14 లక్షల మంది రైతులకు బంపర్ బెనిఫిట్!ACB Raids: ల్యాండ్ అండ్ సర్వే డీడీ నరహరి ఇళ్లపై మెరుపు దాడులు.. ఒకేసారి 12 ప్రాంతాల్లో సోదాలు!
ACB Raids: హైదరాబాద్లో ల్యాండ్ అండ్ సర్వే విభాగం డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇళ్లపై ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం భారీ సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఛత్రినాకలోని ఆయన ఇల్లు, కార్యాలయం సహా 10 ప్రాంతాల్లో ఇద్దరు డీఎస్పీల ఆధ్వర్యంలో 10 బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నాయి. ఈ తనిఖీల్లో భారీగా బంగారం, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మరింత ACB Raids: ల్యాండ్ అండ్ సర్వే డీడీ నరహరి ఇళ్లపై మెరుపు దాడులు.. ఒకేసారి 12 ప్రాంతాల్లో సోదాలు!TG Public School: రేపు తొలి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
TG Public School: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో రాష్ట్రంలోనే మొదటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ సిద్ధమైంది. ఐదు ఎకరాల విస్తీర్ణంలో, కార్పొరేట్ ప్రమాణాలతో ప్రీ-ప్రైమరీ నుండి ఇంటర్ వరకు నిర్మించిన ఈ మోడల్ స్కూల్ను రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ల్యాబ్లు, క్రీడా మైదానాన్ని పరిశీలించనున్న సీఎం.. విద్యార్థుల కోసం అల్పాహార పథకాన్ని ప్రారంభించి అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
మరింత TG Public School: రేపు తొలి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!Pawan Kalyan: మోడీకి అందుకే మద్దతిస్తున్న.. భద్రత లేని జీవితాలు వృధా
Pawan Kalyan: ముంబై 26/11 దాడుల సమయంలో దేశానికి ఒక బలమైన నాయకుడు కావాలని వారణాసిలో తన తండ్రి అస్తికలు నిమజ్జనం చేసేటప్పుడు కాశీ విశ్వనాథుడిని మొక్కుకున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు ఒక గొప్ప నాయకుడిని పుట్టించే శక్తి భారతదేశానికి ఉందన్న నాని పాల్కీవాలా మాటలను గుర్తుచేస్తూ.. కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షల రూపమే నరేంద్ర మోదీ అని చెప్పారు. అభివృద్ధి కంటే దేశ భద్రతే ముఖ్యమని, అందుకే తమ సదస్సులో మోదీని అభినందిస్తూ మొదటి తీర్మానం పెట్టామని స్పష్టం చేశారు.
మరింత Pawan Kalyan: మోడీకి అందుకే మద్దతిస్తున్న.. భద్రత లేని జీవితాలు వృధాNEET Re-Exam: దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ బ్యాన్.. నీట్ ఎక్సమ్ టైమింగ్ పెంపు
NEET Re-Exam: ఈ నెల 21న జరిగే నీట్ రీ-ఎగ్జామ్ భద్రతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జూన్ 22 వరకు దేశంలో టెలిగ్రామ్ యాప్ను తాత్కాలికంగా నిషేధించింది. అలాగే జూన్ 30 వరకు టెలిగ్రామ్ ఎడిట్ ఆప్షన్ను కూడా తొలగించింది. మరోవైపు ఎన్టీఏ పరీక్ష సమయాన్ని 180 నిమిషాల నుండి 195 నిమిషాలకు పెంచింది. పేపర్ లీక్ అవ్వకుండా ఉండేందుకు దేశంలోనే తొలిసారిగా ప్రశ్నాపత్రాల తరలింపునకు విమానాలను ఉపయోగించారు.
మరింత NEET Re-Exam: దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ బ్యాన్.. నీట్ ఎక్సమ్ టైమింగ్ పెంపుAbhijit Deepak: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి..!
Abhijit Deepak: జైపూర్లో నీట్ లీకేజీకి వ్యతిరేకంగా సీజేపీ నిర్వహించిన నిరసన ర్యాలీలో పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు చెంపదెబ్బ కొట్టి దాడి చేశారు. ఆగ్రహించిన కార్యకర్తలు దాడి చేసిన వారిని పట్టుకుని చితకబాదారు. సుప్రీంకోర్టు జడ్జి యువతను బొద్దింకలతో పోల్చిన వ్యాఖ్యల బ్యాక్డ్రాప్లో పుట్టిన ఈ పార్టీ.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం దేశవ్యాప్త ఆందోళనలు చేస్తోంది.
మరింత Abhijit Deepak: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి..!Pawan Kalyan: ప్రాంతీయ గోడలు బద్దలుకొట్టండి.. సోషల్ మీడియాలో మీ మైండ్తో ఆడుకుంటున్నారు
Pawan Kalyan ఢిల్లీలో జనసేన సదస్సులో పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనను అభినందిస్తూ తీర్మానం చేశారు. స్వార్థపరుల వల్లే ‘కాక్రోచ్ జనతా పార్టీలు’ వస్తున్నాయని, సోషల్ మీడియాలో యువత మైండ్తో ఆడుకునే శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వర్గీస్ కురియన్, ఈ శ్రీధరన్, విశ్వేశ్వరయ్యల సేవలను గుర్తుచేస్తూ.. ప్రాంతీయ గోడలు బద్దలుకొట్టి ‘భారతీయుడు’ అనే ఒకే గుర్తింపుతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.
మరింత Pawan Kalyan: ప్రాంతీయ గోడలు బద్దలుకొట్టండి.. సోషల్ మీడియాలో మీ మైండ్తో ఆడుకుంటున్నారు