రైతుల ఆందోళనలతో మారిన రూల్స్ – కొత్త జీవో ఇదీ.
గత నెలలో ప్రభుత్వం ప్రకటించిన స్కీమ్ ప్రకారం సన్నకారు రైతులకు రూ.50 వేల వరకు మాత్రమే పూర్తి మాఫీ లభించగా.. చిన్న రైతులకు 50 శాతం, పెద్ద రైతులకు కేవలం రూ.5 వేల రుణమాఫీ మాత్రమే లభించింది. దీనిపై రైతు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో సీఎం విజయ్ అపెక్స్ కమిటీతో భేటీ అయ్యి కొత్త మార్పులు చేశారు.
తాజా సవరణల ప్రకారం.. కో-ఆపరేటివ్ బ్యాంకుల ద్వారా రూ.75,000 వరకు పంట రుణాలు తీసుకున్న సన్న, చిన్న, పెద్ద రైతులకు ఎలాంటి తారతమ్యాలు లేకుండా పూర్తి అప్పును (100 శాతం) ప్రభుత్వం మాఫీ చేయనుంది.
ఒకవేళ రూ.75,000 కంటే ఎక్కువ పంట రుణం ఉన్నట్లయితే.. సదరు రైతులకు అకౌంట్ పరిమితితో సంబంధం లేకుండా ఒకే పద్ధతి కింద ఒక్కొక్కరికి రూ.35,000 చొప్పున రుణమాఫీ వర్తింపజేయనున్నారు.
పాత స్కీమ్ Vs సీఎం విజయ్ సరికొత్త రుణమాఫీ విధానం:
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత ఒడిదొడుకుల్లో ఉన్నప్పటికీ.. అన్నదాతల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకునే సీఎం విజయ్ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటనలో పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గైడ్లైన్స్కు కట్టుబడి.. రుణమాఫీ కింద సహకార బ్యాంకులకు ప్రభుత్వం రీ-ఇంబర్స్ చేయాల్సిన మొత్తం సొమ్మును రాబోయే 45 నుంచి 60 రోజుల్లోగా పూర్తిగా క్రెడిట్ చేస్తామని తమిళనాడు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 14.43 లక్షల మంది రైతులు అప్పుల బాధల నుంచి విముక్తి పొందనున్నారు.