Ktr: ఫార్ములా-ఈ రేస్ కేసు: మొబైల్ ఇచ్చేది లేదు

Ktr: ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో 2021 నవంబర్ నుండి 2023 డిసెంబర్ మధ్యకాలంలో వాడిన మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను సమర్పించాలని ఏసీబీ ఆదేశించగా, ఈ మేరకు కేటీఆర్ అధికారులు వారికి లేఖ ద్వారా స్పందించారు.

ఈ లేఖలో కేటీఆర్, వ్యక్తిగత డివైజ్‌లను సమర్పించడం తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే చర్యగా అభివర్ణించారు. తాను 2024లో మొబైల్ ఫోన్‌లు మార్చినట్టు, పాత ఫోన్‌లు ప్రస్తుతం తన వద్ద లేనట్టు వెల్లడించారు. పైగా, వ్యక్తిగత డేటాను అనుమతులేదు అనే పాయింట్‌తో లీగల్ గ్రౌండ్‌లు కూడా లేఖలో ప్రస్తావించారు.

న్యాయపరంగా స్పందించిన కేటీఆర్ పక్షం

కేటీఆర్ తరపు న్యాయవాదులు, హైకోర్టు మరియు సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరిస్తూ, ప్రత్యేక కోర్టు ఆదేశం లేకుండా ఏసీబీకి వ్యక్తిగత మొబైల్ లేదా ల్యాప్‌టాప్ స్వాధీనం చేసే అధికారం లేదని వాదించారు. ఈ అంశాన్ని ఎత్తిచూపుతూ ఏసీబీ చర్యలు చట్టపరంగా సరైనవేమీ కావని లేఖలో పేర్కొన్నారు.

ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత ఉందని స్పష్టం

ఫార్ములా-ఈ రేసు నిర్వహణకు సంబంధించిన అధికారిక లావాదేవీలు పూర్తిగా బ్యాంకుల ద్వారా పారదర్శకంగా జరిగాయని, వాటికి సంబంధించిన సమాచారం ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉందని కేటీఆర్ తెలిపారు. ఇదే సమాచారాన్ని ఏసీబీకి కూడా అప్పగించినట్లు వివరించారు.

ఈవెంట్ ప్రభుత్వ కార్యక్రమమే: కేటీఆర్

ఫార్ములా-ఈ రేసు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అధికారిక క్రీడా కార్యక్రమమని కేటీఆర్ స్పష్టం చేశారు. దీనిలో తన వ్యక్తిగత పాత్ర లేదని, అన్ని కార్యకలాపాలు సర్కారు స్థాయిలోనే జరిగాయని స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని, రాజకీయ ప్రయోజనాల కోసమే ఇవి చేయబడుతున్నాయని ఆయన వాదిస్తున్నారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Crime News: భార్య పుట్టింటికి వెళ్లింద‌ని పెళ్లి కుదిర్చిన వ్య‌క్తిని హ‌త‌మార్చిన భ‌ర్త‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *