Terrorist

Terrorist: ఐదు రోజులకు ఒక టెర్రరిస్ట్ ఖతం.. ఈ ఏడాది ఎంతమంది పోయారంటే.

Terrorist: జమ్మూకశ్మీర్‌లో ఈ ఏడాది మొత్తం 75 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. హతమైన ఉగ్రవాదుల్లో 60 శాతం మంది పాకిస్థాన్‌కు చెందినవారేనని ఆర్మీ అధికారులు జాతీయ మీడియాకు తెలిపారు. అంటే ప్రతి ఐదు రోజులకు ఒక ఉగ్రవాదిని భారత భద్రతా బలగాలు హతమార్చుతున్నాయి. ఇప్పటివరకు చనిపోయిన 75 మందిలో ఎక్కువ మంది విదేశీ ఉగ్రవాదులు. 

వీరిలో నియంత్రణ రేఖ – ఎల్‌ఓసి, అంతర్జాతీయ సరిహద్దు-ఐబి నుంచి  చొరబడేందుకు ప్రయత్నించిన 17 మంది ఉగ్రవాదులు, అంతర్గత ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో 26 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పెరుగుతున్న ఉగ్రవాద ముప్పును అరికట్టడంలో భద్రతా బలగాల చర్యలు ముఖ్యమైన ముందడుగుగా చెబుతున్నారు. .

జమ్మూ ప్రాంతంలోని ఐదు జిల్లాలైన జమ్మూ, ఉధంపూర్, కథువా, దోడా, రాజౌరీలలో 42 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. కశ్మీర్ లోయలోని బారాముల్లా, బండిపొరా, కుప్వారా, కుల్గాం జిల్లాల్లో విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు.

ఇది కూడా చదవండి: Allu Arjun: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

Terrorist: జమ్మూ కాశ్మీర్‌లోని తొమ్మిది జిల్లాల్లో విదేశీ ఉగ్రవాదుల ఉనికిని గుర్తించారు. బారాముల్లాలో అత్యధిక సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు.  బారాముల్లాలో ఎక్కువ మంది విదేశీ ఉగ్రవాదులు ఉరి సెక్టార్‌లోని సబురా నాలా ప్రాంతం, మెయిన్ ఉరి సెక్టార్, కమల్‌కోట్ ఉరి ఎల్‌ఓసి మరియు చక్ తప్పర్ లోతట్టు ప్రాంతాలలో ఉన్నారు.

జమ్మూకశ్మీర్‌లో స్థానిక ఉగ్రవాదుల సంఖ్య తగ్గింది. ప్రధానంగా ఈ ప్రాంతంలో పాక్ ఉగ్రవాదులు చురుగ్గా ఉన్నారు. స్థానిక టెర్రర్ గ్రూప్ దాదాపు తుడిచిపెట్టుకుపోయిందని ఓ అధికారి తెలిపారు.

2024లో జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన 60 ఉగ్రవాద ఘటనల్లో 32 మంది పౌరులు, 26 మంది భద్రతా బలగాలు సహా మొత్తం 122 మంది మరణించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *