Sangareddy

Sangareddy: గుండెపోటుతో 12 ఏళ్ల బాలుడు మృతి

Sangareddy: గుండెపోటుతో 12 ఏళ్ల బాలుడు నితిన్ మృతి చెందాడు. ఈ హృదయ విదారక ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఇందిరా కాలనీలో చోటుచేసుకుంది. ఇందిర కాలనీలో నివసిస్తున్న జయమ్మ కుమారుడు నితిన్ పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్నాడు. నిద్ర లేచిన నితిన్ స్కూలుకు రెడీ అయి టీ బ్రెడ్ తో బ్రేక్ ఫాస్ట్ చేశాక శ్వాస సరిగ్గా రావట్లేదని తల్లితో చెప్పాడు.

వెంటనే నితిన్ ను దగ్గరలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లగా బాలుడు గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఒక్కసారిగా ఆ కుటుంబం ఉలిక్కిపడి కన్నీరు మున్నీరయ్యారు. ఎప్పుడు చురుగ్గా ఆరోగ్యంగా ఉండే కొడుకు సడన్ గా మృతి చెందడంతో ఆ తల్లి గుండెలు బాదుకుంది. ఆసుపత్రి ప్రాంగణం శోకసంద్రంలో మునిగిపోయింది. నితిన్ మృతి చెందడంతో ఇందిరా కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *