Zameer Ahmed:భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న వివాదంపై కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ మంత్రి జమీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలకు వాడుకోవాలని చూస్తున్నదని ఆరోపించారు. పాకిస్తాన్కు మద్దతుదారుగా కాంగ్రెస్ను చూపాలని బీజేపీ చూడటం సరికాదని హితవు పలికారు. ఇలాంటి రాజకీయాలు మాని పాకిస్తాన్పై యుద్ధం చేయాలని సూచించారు.
Zameer Ahmed:కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్తో సంబంధం లేదని కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ స్పష్టంచేశారు. యుద్ధం వస్తే తాను రెడీగా ఉంటానని, మనదేశం తరఫున దేనికైనా తాను సిద్ధమేనని తేల్చిచెప్పారు. నేను మానవ బాంబు కావడానికి కూడా సిద్ధమేనని జమీర్ అహ్మద్ ప్రకటించారు. దీనికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సిద్ధమేనా? అని ప్రశ్నించారు.
Zameer Ahmed:మోదీ, షా.. నాకో బాంబు ఇవ్వండి దానిని తన ఒంటికి కట్టుకొని వెళ్లి పాకిస్తాన్పై వేసి దాడి చేసేందుకు సిద్ధమేనని మంత్రి జమీర్ అహ్మద్ స్పష్టం చేశారు. మానవబాంబునై తన ప్రాణాన్ని పణంగా పెట్టి పాకిస్తాన్ నాశనం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ను, ముస్లింలను దూషించవద్దని ఆయన కోరారు. తామెప్పుడూ భారతీయులమేనని, హిందుస్థానీలమని చెప్పారు.