Gold Rate Today

Gold Rate Today: బంగారంతో పోటీ పడుతున్న వెండి.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఒక రోజు స్వల్పంగా తగ్గినా, మరుసటి రోజే మళ్లీ గగనానికి ఎగబాకుతున్నాయి. దీంతో సాధారణ కుటుంబాలు బంగారం కొనడం దాదాపు అసాధ్యంగా మారింది. ప్రస్తుతం తులం బంగారం ధర లక్ష రూపాయలకుపైగా ఉండటం వినియోగదారులకు భారీ భారమైంది.

సెప్టెంబర్ 16, 2025 – బంగారం & వెండి ధరలు

నగరం / రాష్ట్రం 24 క్యారెట్ల బంగారం (10గ్రా) 22 క్యారెట్ల బంగారం (10గ్రా) వెండి (1 కిలో)
ఢిల్లీ ₹1,11,200 ₹1,01,940 ₹1,32,900
హైదరాబాద్ ₹1,11,050 ₹1,01,790 ₹1,42,900
ముంబై ₹1,11,050 ₹1,01,790 ₹1,32,900
చెన్నై ₹1,11,370 ₹1,02,090 ₹1,42,900
బెంగళూరు ₹1,11,050 ₹1,01,790 ₹1,32,900
విజయవాడ ₹1,11,050 ₹1,01,790 ₹1,32,900
కేరళ ₹ 1,11,050 ₹ 1,01,790
₹1,42,900

వెండి ధరలు కూడా అధికమే

కిలో వెండి ధర దేశీయంగా రూ.1,32,900గా ఉండగా, హైదరాబాద్‌, చెన్నై, కేరళ రాష్ట్రాల్లో మాత్రం ఇంకా ఎక్కువగా రూ.1,42,900కి చేరింది.

ధరల పెరుగుదలకు కారణాలు

బులియన్‌ మార్కెట్‌ నిపుణుల ప్రకారం బంగారం ధరలు పెరగడానికి పలు అంశాలు కారణమవుతున్నాయి.

  • ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పెరగడం

  • డాలర్ విలువలో మార్పులు రావడం

  • అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ అధికం కావడం

  • ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు బంగారంపై ఆధారపడటం

ఇక రానున్న పండుగ సీజన్‌లో భారత్‌లో బంగారం డిమాండ్ మరింత పెరగనుంది. దీంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *