Gold Rate Today

Gold Rate Today: 6 వేలు తగ్గిన బంగారం ధర.. తులం ధర ఎంతంటే..

Gold Rate Today: బంగారం ధరలు దేశ వ్యాప్తంగా ఊగిసలాటకు గురవుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరుసటి రోజు పెరుగుతున్న ధోరణి కొనసాగుతోంది. ఆగస్ట్ 23న ఉదయం నమోదైన ధరల ప్రకారం, నిన్నటితో పోలిస్తే బంగారం ధరలు సుమారు రూ.250 వరకు తగ్గాయి. కొన్ని రోజుల క్రితం లక్షా ఐదు వేల రూపాయల వరకు చేరిన పసిడి, ఇప్పుడు మళ్లీ లక్ష రూపాయల దగ్గరికి చేరుకుంది. అయితే కనీసం తులం ధర 90 వేల రూపాయల వరకైనా తగ్గుతుందేమోనని ప్రజలు ఆశిస్తున్నప్పటికీ, సమీప భవిష్యత్తులో అలాంటి అవకాశం కనిపించడం లేదు.

 ఈరోజు బంగారం ధరలు (23 ఆగస్ట్ 2025)

నగరం 24 క్యారెట్లు (10 గ్రాములు) 22 క్యారెట్లు (10 గ్రాములు)
ఢిల్లీ ₹1,00,670 ₹92,290
ముంబై ₹1,00,520 ₹92,140
హైదరాబాద్ ₹1,00,520 ₹92,140
విజయవాడ ₹1,00,520 ₹92,140
బెంగళూరు ₹1,00,520 ₹92,140
కోల్‌కతా ₹1,00,520 ₹92,140
చెన్నై ₹1,00,520 ₹92,140

బంగారం స్వల్పంగా తగ్గినప్పటికీ, వెండి మాత్రం స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర ₹1,18,100గా కొనసాగుతోంది.

నిపుణుల అంచనా ప్రకారం, ప్రపంచ మార్కెట్‌లో డాలర్ మార్పిడి, వడ్డీ రేట్ల ప్రభావం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు బంగారం ధరలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. అందువల్ల ధరలు స్థిరంగా ఉండటం కష్టమేనని భావిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Gold Rate: బంగారం ధరల తగ్గుదలకు బ్రేక్ . . ఈరోజు ఎంతుందంటే . .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *