Kishan Reddy 

Kishan Reddy: మెట్రో రైలుపై బురదజల్లడం ఆపండి.. మేము సీఎంకు కాదు, ప్రజలకే జవాబుదారీ!

Kishan Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మెట్రో ఫేజ్-1కు కేంద్రం రూ.1200 కోట్లు ఇచ్చిందని చెప్తూ.. మెట్రోపై బురదజల్లే ప్రయత్నం సరికాదన్నారు. తాము రేవంత్‌కు కాకుండా తెలంగాణ ప్రజలకు జవాబుదారీ అని స్పష్టం చేశారు. రూ.13 వేల కోట్ల IRFC లోన్ పెండింగ్‌కు పలు కారణాలు ఉన్నాయని, దీనిపై కేంద్ర, రాష్ట్ర అధికారులు కలిసి చర్చించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.

మరింత Kishan Reddy: మెట్రో రైలుపై బురదజల్లడం ఆపండి.. మేము సీఎంకు కాదు, ప్రజలకే జవాబుదారీ!
ACB Raids

ACB Raids: ల్యాండ్ అండ్ సర్వే డీడీ నరహరి ఇళ్లపై మెరుపు దాడులు.. ఒకేసారి 12 ప్రాంతాల్లో సోదాలు!

ACB Raids: హైదరాబాద్‌లో ల్యాండ్ అండ్ సర్వే విభాగం డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇళ్లపై ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం భారీ సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఛత్రినాకలోని ఆయన ఇల్లు, కార్యాలయం సహా 10 ప్రాంతాల్లో ఇద్దరు డీఎస్పీల ఆధ్వర్యంలో 10 బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నాయి. ఈ తనిఖీల్లో భారీగా బంగారం, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మరింత ACB Raids: ల్యాండ్ అండ్ సర్వే డీడీ నరహరి ఇళ్లపై మెరుపు దాడులు.. ఒకేసారి 12 ప్రాంతాల్లో సోదాలు!
TG Public School

TG Public School: రేపు తొలి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!

TG Public School: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో రాష్ట్రంలోనే మొదటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ సిద్ధమైంది. ఐదు ఎకరాల విస్తీర్ణంలో, కార్పొరేట్ ప్రమాణాలతో ప్రీ-ప్రైమరీ నుండి ఇంటర్ వరకు నిర్మించిన ఈ మోడల్ స్కూల్‌ను రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ల్యాబ్‌లు, క్రీడా మైదానాన్ని పరిశీలించనున్న సీఎం.. విద్యార్థుల కోసం అల్పాహార పథకాన్ని ప్రారంభించి అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

మరింత TG Public School: రేపు తొలి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
Pawan Kalyan

Pawan Kalyan: ప్రాంతీయ గోడలు బద్దలుకొట్టండి.. సోషల్ మీడియాలో మీ మైండ్‌తో ఆడుకుంటున్నారు

Pawan Kalyan ఢిల్లీలో జనసేన సదస్సులో పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనను అభినందిస్తూ తీర్మానం చేశారు. స్వార్థపరుల వల్లే ‘కాక్రోచ్ జనతా పార్టీలు’ వస్తున్నాయని, సోషల్ మీడియాలో యువత మైండ్‌తో ఆడుకునే శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వర్గీస్ కురియన్, ఈ శ్రీధరన్, విశ్వేశ్వరయ్యల సేవలను గుర్తుచేస్తూ.. ప్రాంతీయ గోడలు బద్దలుకొట్టి ‘భారతీయుడు’ అనే ఒకే గుర్తింపుతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.

మరింత Pawan Kalyan: ప్రాంతీయ గోడలు బద్దలుకొట్టండి.. సోషల్ మీడియాలో మీ మైండ్‌తో ఆడుకుంటున్నారు
Revanth Reddy

Revanth Reddy: కిషన్‌రెడ్డి వెనుక కేటీఆర్‌ ఉన్నారు.. హైదరాబాద్ మెట్రోపై కేంద్రం ఘోర వివక్ష!

Revanth Reddy: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 మరియు ఎల్‌అండ్‌టీ ఐఆర్‌ఎఫ్‌సీ లోన్ నిధులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేటీఆర్ కలిసి అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అహ్మదాబాద్, విశాఖ మెట్రోలకు అనుమతులిచ్చి హైదరాబాద్‌పై కేంద్రం వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ఫేజ్-1ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, ఫేజ్-2ను నిర్మించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

మరింత Revanth Reddy: కిషన్‌రెడ్డి వెనుక కేటీఆర్‌ ఉన్నారు.. హైదరాబాద్ మెట్రోపై కేంద్రం ఘోర వివక్ష!
Kishan Reddy:

Kishan Reddy: సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు అదృశ్యం

Kishan Reddy: సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు అదృశ్యం కావడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ భారీ ఉదంతంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు సింగరేణి ఆర్థిక స్థిరత్వాన్ని, భవిష్యత్తును దెబ్బతీస్తాయని కిషన్ రెడ్డి తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.

మరింత Kishan Reddy: సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు అదృశ్యం
Telangana Rains

Telangana Rains: రాబోయే 2 గంటల్లో భారీ వర్షాలు.. హైదరాబాద్‌తో పాటు ఆ జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ!

Telangana Rains: తెలంగాణలో రాబోయే రెండు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు 60-80 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ‘రెడ్ అలర్ట్’ ప్రకటించారు. ఖమ్మం, నల్గొండ తదితర జిల్లాలకు ఆరెంజ్, వరంగల్, సిద్దిపేట వైపు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ప్రయాణికులు, లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

మరింత Telangana Rains: రాబోయే 2 గంటల్లో భారీ వర్షాలు.. హైదరాబాద్‌తో పాటు ఆ జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ!
Phone Tapping Case

Phone Tapping Case: మంత్రి తుమ్మల నివాసానికి పోలీసులు.. సాక్షిగా కీలక వాంగ్మూలం నమోదు!

Phone Tapping Case: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు. 2023 ఎన్నికల సమయంలో ఆయన ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించిన పోలీసులు, శనివారం ఆయన నివాసంలో సాక్షిగా వాంగ్మూలం తీసుకున్నారు. సీపీ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను విచారించగా, తాజా పరిణామం పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

మరింత Phone Tapping Case: మంత్రి తుమ్మల నివాసానికి పోలీసులు.. సాక్షిగా కీలక వాంగ్మూలం నమోదు!
Telangana High Court

Telangana High Court: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్.. భారీ జరిమానా విధిస్తూ సంచలన తీర్పు.. సీజే రిలీఫ్ ఫండ్‌కు జమ చేయాలని ఆదేశం!

Telangana High Court: ఒక కేసు విచారణలో సకాలంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకుండా కాలయాపన చేసినందుకు గాను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు రూ. 50 వేల జరిమానా విధించింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కోర్టు ఆదేశాల విషయంలో నిర్లక్ష్యం వహించడంపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఈ జరిమానా మొత్తాన్ని హైకోర్టు సీజే రిలీఫ్ ఫండ్‌కు జమ చేయాలని ఆదేశించడంతో ఈ పరిణామం అధికారుల వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మరింత Telangana High Court: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్.. భారీ జరిమానా విధిస్తూ సంచలన తీర్పు.. సీజే రిలీఫ్ ఫండ్‌కు జమ చేయాలని ఆదేశం!
TG:

TG: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల

TG: తెలంగాణ ఐసెట్ ఫలితాలను హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ బాలకిష్టారెడ్డి విడుదల చేశారు. మే 13, 14 తేదీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కోసం ఈ పరీక్ష జరిగింది. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి అధికారిక వెబ్‌సైట్ నుండి తమ ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

మరింత TG: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల