KTR

KTR: సిరికొండ పర్యటనలో కేటీఆర్ తీవ్ర ధ్వజం.. మృతుడి కుటుంబానికి రూ.3 లక్షల సాయం!

KTR: సిరికొండ మండలం పొన్నలో పర్యటించిన మాజీ మంత్రి కేటీఆర్.. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు పాండురంగ కుటుంబాన్ని పరామర్శించి, బీఆర్ఎస్ తరఫున రూ. 3 లక్షల సాయం అందించారు. పంట కొనుగోళ్లలో వైఫల్యం వల్లే ఈ మరణం సంభవించిందని, మృతి చెందిన రైతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు ప్రాణాలు కోల్పోకుండా ప్రభుత్వాన్ని నిలదీయాలని, మరో రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని కేటీఆర్ పేర్కొన్నారు.

మరింత KTR: సిరికొండ పర్యటనలో కేటీఆర్ తీవ్ర ధ్వజం.. మృతుడి కుటుంబానికి రూ.3 లక్షల సాయం!
bandi bhageerath

Bandi Sai Bhageerath: పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్

Bandi Sai Bhageerath: పోక్సో కేసులో బిజెపి నేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు మల్కాజిగిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయి నెల రోజులకు పైగా జైల్లో ఉన్న భగీరథ్‌కు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది.

మరింత Bandi Sai Bhageerath: పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్
Gandhi Sarovar Project

Gandhi Sarovar Project: ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్.. సీఎం రేవంత్ రెడ్డి హర్షం!

Gandhi Sarovar Project: హైదరాబాద్ మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా బాపూఘాట్ వద్ద నిర్మించనున్న ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ పరిణామంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యావరణ, సాంస్కృతిక మరియు వినోద కేంద్రంగా ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం తీర్చిదిద్దనుంది. అనుమతులు రావడంతో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.

మరింత Gandhi Sarovar Project: ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్.. సీఎం రేవంత్ రెడ్డి హర్షం!
Pawan Kalyan

Pawan Kalyan: మణికొండలో జనసేన నూతన ఆఫీస్ ప్రారంభం..!

Pawan Kalyan: తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ మణికొండలో నూతన రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం ఈ ఆఫీస్‌ను ఏర్పాటు చేశారు. ఏ పార్టీ కలిసి రాకపోయినా ఒంటరిగానైనా బరిలోకి దిగుతామని పవన్ ఇప్పటికే స్పష్టం చేయగా.. ఆయన వ్యూహాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

మరింత Pawan Kalyan: మణికొండలో జనసేన నూతన ఆఫీస్ ప్రారంభం..!
TG High Court

TG High Court: రాయదుర్గం భూముల వేలంపై 3 వారాల స్టే.. రంగంలోకి ఎస్‌బీఐ (SBI)!

TG High Court: హైదరాబాద్‌ పరిధిలోని రాయదుర్గం పరిధిలోని ఐటీ హబ్‌లో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన భూముల వేలంపై దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’(SBI) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

మరింత TG High Court: రాయదుర్గం భూముల వేలంపై 3 వారాల స్టే.. రంగంలోకి ఎస్‌బీఐ (SBI)!
Adulterated Paneer

Adulterated Paneer: 825 కిలోల కల్తీ పనీర్ సీజ్.. గంజిపొడి, సింథటిక్ పాలతో దందా!

Adulterated Paneer: హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉమ్మడిగా 45 ఫుడ్ ఔట్‌లెట్లు, 8 పనీర్ తయారీ కేంద్రాలపై దాడులు చేసి 825 కిలోల కల్తీ పనీర్, నకిలీ చీజ్ సీజ్ చేశారు. సింథటిక్ పాలు, గంజిపొడి, జంతువుల కొవ్వుతో ఈ పనీర్ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. లైసెన్స్ లేని నిందితులపై కేసులు నమోదు కాగా, తనిఖీలు కొనసాగుతాయని అధికారులు ప్రకటించారు.

మరింత Adulterated Paneer: 825 కిలోల కల్తీ పనీర్ సీజ్.. గంజిపొడి, సింథటిక్ పాలతో దందా!
Harish Rao

Harish Rao: కాంగ్రెస్ మార్క్ మోసం ప్రజలకు అర్థమైంది..!

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారని, ప్రస్తుతం జనాలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని హరీష్ రావు విమర్శించారు. మరోవైపు, పోలవరం బ్యాక్‌వాటర్ కారణంగా తెలంగాణ సరిహద్దు గ్రామాలకు ముంపు ముప్పు పొంచి ఉందన్న బీఆర్ఎస్ వినతిపై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (PPA) సానుకూలంగా స్పందించిందని, ప్రభావిత ప్రాంతాలకు రక్షణ చర్యలు లేదా ఆర్‌అండ్‌ఆర్ కింద నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చిందని హరీష్ రావు వెల్లడించారు.

మరింత Harish Rao: కాంగ్రెస్ మార్క్ మోసం ప్రజలకు అర్థమైంది..!
Revanth Reddy:

Revanth Reddy: రూ.600 కోట్ల టెండర్లలో రూ.3 వేల కోట్ల అవినీతా?.. ఉన్నత చదువులు చదివిన మేధావులపై సీఎం రేవంత్ ఫైర్!

Revanth Reddy: రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి, విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆడారు. విద్యాశాఖకు ప్రభుత్వం రూ.27 వేల కోట్లు ఖర్చు చేస్తోందని చెప్తూ.. కులాల వారీగా హాస్టళ్ల కంటే అందరూ కలిసి చదివే టీపీఎస్ విధానమే సరైందని పేర్కొన్నారు. 1800 మందితో ఆరుట్ల స్కూల్ ‘నో వేకెన్సీ’ స్థాయికి చేరిందని, 2034 నాటికి ఇక్కడి పిల్లలు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ సాధించేలా ట్రైనింగ్ ఇస్తామన్నారు. అలాగే ఉప్పల్ స్టేడియం టెండర్లపై వస్తున్న అవినీతి ఆరోపణలను సీఎం తిప్పికొట్టారు.

మరింత Revanth Reddy: రూ.600 కోట్ల టెండర్లలో రూ.3 వేల కోట్ల అవినీతా?.. ఉన్నత చదువులు చదివిన మేధావులపై సీఎం రేవంత్ ఫైర్!
Pawan Kalyan

Pawan Kalyan: ‘చోటా గబ్బర్ సింగ్’ ఇంటికి వచ్చి పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం

Pawan Kalyan: అరుదైన ‘డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ’ వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల అభిమాని నిరంజన్‌ను పరామర్శించడానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హన్మకొండలోని ఆయన నివాసానికి స్వయంగా వచ్చారు. సామాజిక కార్యకర్త చిలువేరు శంకర్ ద్వారా బాబు పరిస్థితి తెలుసుకున్న పవన్.. నిరంజన్ ఇంట 45 నిమిషాలు గడిపి, ధైర్యం చెప్పారు. పవన్ రాకతో ఆ బాలుడి చివరి కోరిక నెరవేరింది.

మరింత Pawan Kalyan: ‘చోటా గబ్బర్ సింగ్’ ఇంటికి వచ్చి పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం
Telangana Public School: 

Telangana Public School: మొదటి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. రూ.15 కోట్లతో అంతర్జాతీయ హంగులు!

Telangana Public School: రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రాష్ట్రంలోనే మొదటి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి, పైలాన్ ఆవిష్కరించారు. రూ.15 కోట్ల ప్రభుత్వ నిధులతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ పాఠశాలలో విద్యార్థులతో కలిసి సీఎం బ్రేక్‌ఫాస్ట్ చేశారు. అనంతరం పేరెంట్స్ కమిటీ సభ్యులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, కాసేపట్లో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

మరింత Telangana Public School: మొదటి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. రూ.15 కోట్లతో అంతర్జాతీయ హంగులు!