Bandi Sai Bhageerath: తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో (POCSO) కేసులో బిజెపి కీలక నేత, ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కు పెద్ద ఊరట లభించింది. ఈ కేసుపై సుదీర్ఘంగా వాదోపవాదాలు విన్న మల్కాజిగిరి జిల్లా కోర్టు శనివారం నాడు భగీరథ్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయి, నెల రోజులకు పైగా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు ఎట్టకేలకు కోర్టు నుండి సానుకూల నిర్ణయం వెలువడింది.
