Supreme Court

Supreme Court: సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్ మంత్రి వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme Court: భారత సైన్యంలో సేవలందిస్తున్న కల్నల్‌ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్‌ మంత్రి కున్వర్‌ విజయ్‌ షా చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒక ప్రజాప్రతినిధి చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని కోర్టు గట్టిగా హెచ్చరించింది. మంత్రి క్షమాపణలు సరిపోవని స్పష్టం చేస్తూ, “ప్రతినిధిగా ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా, ఆలోచించి మాట్లాడాలి” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అయితే మంత్రి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర ప్రతిస్పందన వస్తోంది. ఈ వ్యాఖ్యలు కల్నల్ సోఫియా ఖురేషి గౌరవాన్ని గాయపరిచినట్లుగా భావిస్తున్నారు. ఆమె పాకిస్థాన్‌పై భారత్‌ చేపట్టిన “ఆపరేషన్ సిందూర్”లో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.

వివాదాస్పదంగా మారిన ఈ వ్యాఖ్యలపై విచారణ కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ బృందంలో మధ్యప్రదేశ్‌కు చెందని ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లు ఉండాలని స్పష్టం చేసింది. అందులో ఒకరు మహిళ కావాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. సిట్ ఈ నెల 28వ తేదీ లోపు నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.

Also Read: GVMC Deputy Mayor: డిప్యూటీ మేయర్‌ సాధించిన జనసేన..

Supreme Court: ఇక ఈ వ్యవహారంపై మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా స్పందించింది. మంత్రి వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. అయితే పోలీసులు కేసులో సరైన సెక్షన్లు చేర్చకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై కచ్చితమైన పర్యవేక్షణ ఉండేందుకు కేసు కోర్టు పరిధిలోనే పరిశీలించాలని నిర్ణయించింది.

మొత్తంగా, కల్నల్‌ ఖురేషిపై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఒక మంత్రి ఇలాంటి పదజాలాన్ని ఉపయోగించడంపై న్యాయస్థానాలు మాత్రమే కాకుండా, ప్రజాసంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *