Srisailam

Srisailam: శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం

Srisailam: శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల కోసం ఆలయ అధికారులు సమస్త ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఆలయ ఈవో ఎం. శ్రీనివాసరావు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఇతర పండితులు కలిసి సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికారు.

Srisailam

Also Read: Viral Video: రైలు ఎక్కుతుండగా పడిపోయిన యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే ?

ఆలయ అధికారులు సీఎం చంద్రబాబుకు బ్రహ్మోత్సవాల వివరాలు తెలియజేసి, ఈ పర్వదినానికి హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు ముఖ్యమంత్రికి స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందించి ఆశీర్వదించారు.

శివభక్తుల కోసం ఈ మహోత్సవాలు ప్రత్యేకంగా నిర్వహించబడతాయి. ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *