Ajmer Sharif Dargah

Ajmer Sharif Dargah: అజ్మీర్ దర్గాలో ఆలయం.. పిటిషన్ పై విచారణకు గ్రీన్ సిగ్నల్

Ajmer Sharif Dargah: అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాలో సంకట్ మోచన్ మహాదేవ్ ఆలయం ఉందని వేసిన పిటిషన్‌ను అజ్మీర్ సివిల్ కోర్టు విచారణకు స్వీకరించింది. బుధవారం కోర్టు దీనిని విచారణకు అర్హమైనదిగా పరిగణించింది. హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా తరఫున ఈ పిటిషన్‌ దాఖలైంది. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, దర్గా కమిటీ అజ్మీర్,  ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కి సివిల్ కోర్టు నోటీసులు పంపింది. ఈ కేసులో తదుపరి విచారణ డిసెంబర్ 20న జరగనుంది. హిస్టారికల్ అండ్ డిస్క్రిప్టివ్ అనే పుస్తకం ఆధారంగా, దర్గా నిర్మాణంలో ఆలయ శిధిలాలను ఉపయోగించారని పిటిషనర్ పేర్కొన్నారు. అలాగే, గర్భగుడి,  సముదాయంలో జైన దేవాలయం ఉన్నట్లు స్థానికులు చెబుతారు. 

ఇది కూడా చదవండి: Maharashtra CM: మహారాష్ట్రలో బీజీపీ ముఖ్యమంత్రి.. క్లారిటీ ఇచ్చిన ఏక్‌నాథ్ షిండే

Ajmer Sharif Dargah: హిస్టారికల్ అండ్ డిస్క్రిప్టివ్ పుస్తకం ఈ పిటిషన్ లో ఉదహరించారు. ఈ పుస్తకంలో, ప్రస్తుత భవనంలో 75 అడుగుల ఎత్తైన బులంద్ దర్వాజా నిర్మాణంలో ఆలయ శిధిలాల భాగాలను న్యాయమూర్తి ప్రస్తావించారు. ఇది నేలమాళిగ లేదా గర్భగుడిని కలిగి ఉంది.  ఇందులో శివలింగం ఉందని పేర్కొన్నారు. ఈ బుక్ లో అంశాల ప్రకారం క బ్రాహ్మణ కుటుంబం ఇక్కడ పూజలు చేసేది.

హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా మాట్లాడుతూ, ‘మీరు అజ్మీర్ దర్గా చుట్టూ తిరుగుతుంటే, బులంద్ దర్వాజాలో హిందూ సంప్రదాయాన్ని చెక్కినట్లు మీరు చూస్తారు. శివాలయం ఎక్కడ ఉంటే అక్కడ ఖచ్చితంగా జలపాతాలు, చెట్లు మొదలైనవి ఉంటాయి. అక్కడ ఖచ్చితంగా నీరు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ఇక్కడ దర్యాప్తు చేయాలని పురావస్తు శాఖకు కూడా విజ్ఞప్తి చేశామని చెప్పారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *