narendra modi

Narendra Modi: ఒడిశాలో ప్రధాని మోదీ మూడు రోజుల పర్యటన

Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజులపాటు ఒడిశాలో పర్యటించనున్నారు. భువనేశ్వర్‌ చేరుకున్న ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఉప ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించిందన్నారు.మొదట ఒడిశాలో, ఆ తర్వాత హర్యానాలో, ఆ తర్వాత మహారాష్ట్రలో బీజేపీ గెలిచిందని ప్రధాని అన్నారు. ఇదీ బీజేపీ ప్రత్యేకత, బీజేపీ కార్యకర్తల బలం అని చెప్పారు.

ఇది కూడా చదవండి: Manipur: మణిపూర్ లో తెరుచుకున్న స్కూల్స్..

Narendra Modi: ఒక ప్రధాని 3 రోజుల పాటు రాష్ట్రంలో ఉండడం ఇదే తొలిసారి. నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో భువనేశ్వర్‌లోని లోక్ సేవా భవన్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న డీజీపీ-ఐజీ సదస్సుకు ప్రధాని మోదీ హాజరవుతారు.

ఈ సదస్సును హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు, రాష్ట్రాల డీజీపీలు, సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ చీఫ్, స్పెషల్ ప్రొటెక్షన్ గార్డ్ ఇందులో పాల్గొంటున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *