Nagarjuna Sagar: వీకెండ్ ఎంజాయ్.. సాగర్ వచ్చేయండి..26 గేట్లు లేపిండ్రు

Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం పెరుగుతోంది. భారీ వర్షాలు, అప్‌స్ట్రీమ్ నుంచి వచ్చిన వరద నీటితో ప్రాజెక్ట్‌లో నీటిమట్టం వేగంగా పెరిగింది. దీంతో అధికారులు 26 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో రెండూ 2,57,867 క్యూసెక్కులుగా నమోదయ్యాయి. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 587.40 అడుగుల నీటిమట్టం ఉంది. నీటిమట్టం మరింత పెరిగే అవకాశాన్ని అధికారులు కొట్టిపారేయడం లేదు.

వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో జలవిద్యుత్ ఉత్పత్తిని కూడా అధికారులు కొనసాగిస్తున్నారు. దీంతో రాష్ట్రానికి విద్యుత్ సరఫరాలో ఉపశమనం లభిస్తోంది.

అధికారుల హెచ్చరికలు

ప్రాజెక్ట్‌ నుంచి పెద్ద ఎత్తున నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున నది తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైతులు తమ పంట పొలాల్లోకి వెళ్లకూడదని, చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ప్రభావిత ప్రాంతాలు

నాగార్జునసాగర్‌ దిగువకు ఉన్న నల్గొండ, గుంటూరు, కృష్ణా జిల్లాల నది తీర ప్రాంతాల్లో నీటి మట్టం పెరిగే అవకాశముంది. ఇప్పటికే తక్కువ ఎత్తులో ఉన్న కొన్ని ప్రాంతాల్లో నీరు చేరినట్లు సమాచారం.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *