Komatireddy Raj Gopal Reddy

Komatireddy Raj Gopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Komatireddy Raj Gopal Reddy: మునుగోడు ప్రజలకు ఏమైనా అన్యాయం జరిగితే తాను ఊరుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే ప్రభుత్వంతో పోరాడటానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. నియోజకవర్గ ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు.

RRR భూ నిర్వాసితుల కోసం పోరాటం
RRR (రీజినల్ రింగ్ రోడ్డు) ప్రాజెక్ట్‌లో భూములు కోల్పోయిన నిర్వాసితుల గురించి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడారు. వారికి న్యాయం జరిగేలా చూస్తానని, దీనికోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని ఆయన హామీ ఇచ్చారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం తాను అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.

మంత్రి పదవిపై వ్యాఖ్యలు
మంత్రి పదవి గురించి అడిగినప్పుడు, తాను పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని రాజగోపాల్‌రెడ్డి గుర్తు చేశారు. “మంత్రి పదవి ఆలస్యమైనా పర్వాలేదు, ఎదురుచూస్తా. నా ప్రధాన లక్ష్యం ప్రజలకు సేవ చేయడం,” అని ఆయన అన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mahaa Yogandhra 2025: మహా న్యూస్ ఆధ్వర్యంలో.. ఘనంగా ప్రైడ్ ఇండియా హానర్ ఆఫ్ విశాఖ కార్యక్రమం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *