emergency landing

Emergency Landing: విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ప్రయాణీకుల పరిస్థితి ఇలా..

Emergency Landing: చెన్నై నుంచి కొచ్చి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆ విమానాన్ని చెన్నైలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానంలోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. ఈ స్పైస్‌జెట్ విమానం 117 మంది ప్రయాణికులతో చెన్నై నుంచి కొచ్చికి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. టేకాఫ్ తర్వాత, విమానంలో కొంత సాంకేతిక లోపాన్ని గమనించిన పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

Emergency Landing: విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. సాంకేతిక లోపం కారణంగా స్పైస్‌జెట్ విమానం క్యూ400 తిరిగి చెన్నైకి చేరుకుందని స్పైస్‌జెట్ ప్రతినిధి తెలిపారు. విమానంలోని ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు.

ఇది కూడా చదవండి: TGPSC: గ్రూప్ 2 హాల్‌టికెట్లు విడుద‌ల‌

ఢిల్లీ-షిల్లాంగ్ విమానం పాట్నాలో అత్యవసర ల్యాండింగ్

అంతకుముందు ఢిల్లీ నుంచి షిల్లాంగ్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం (ఎస్‌జీ 2950) పాట్నాలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ విమానంలో దాదాపు 80 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. అందరూ సురక్షితంగా ఉన్నారు. విమానం విండ్‌స్క్రీన్‌లో పగుళ్లు రావడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఉదయం 7.03 గంటలకు ఢిల్లీ నుంచి విమానం బయలుదేరింది. 10.02కి షిల్లాంగ్ చేరుకోవాల్సి ఉండగా అంతకు ముందు పాట్నాలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Atal Bihari Vajpayee: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి.. నివాళులర్పించిన ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *