Jammu Kashmir Assembly Elections 2024

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ తొలిదశ ఎన్నికలు ప్రారంభం.. 

దశాబ్దం తరువాత తొలిసారిగా జమ్మూ.. కాశ్మీర్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ 7 జిల్లాల్లోని 24 అసెంబ్లీ స్థానాల్లో ఈరోజు ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఇందులో 23.27 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న 35 వేల మందికి పైగా కశ్మీరీ పండిట్‌లు కూడా ఓటు వేయగలరు. ఢిల్లీలో వారి కోసం 24 ప్రత్యేక బూత్‌లను ఏర్పాటు చేశారు.

మొదటి దశలో ఉన్న 24 సీట్లలో 8 సీట్లు జమ్మూ డివిజన్‌లో – 16 సీట్లు కాశ్మీర్ వ్యాలీలో ఉన్నాయి. గరిష్టంగా 7 సీట్లు అనంత్‌నాగ్‌లో, కనీసం 2 సీట్లు షోపియాన్ జిల్లాల్లో ఉన్నాయి.

ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం తొలి దశలో 219 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 9 మంది మహిళలు, 92 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. 110 మంది అభ్యర్థులు లక్షాధికారులు కాగా, 36 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ముఫ్తీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బిజ్‌బెహరా సీటు కూడా ఈ దశలోనే ఉంది. ఇక్కడ పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మెహబూబా, ఆమె తండ్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ సీఎంలుగా ఉన్నారు.

జమ్మూ కాశ్మీర్‌లోని 90 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడికానున్నాయి.

నిజానికి పదేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 2014 ఎన్నికల్లో పీడీపీ అత్యధికంగా 28 సీట్లు, బీజేపీ 25 సీట్లు గెలుచుకున్నాయి. రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *