Shubhanshu Shukla

Shubhanshu Shukla: శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు డేట్ ఫిక్స్..

Shubhanshu Shukla: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా వాయిదాల అనంతరం ఇప్పుడు చివరికి ఆయన అంతరిక్ష ప్రయాణానికి తుది తేదీని ఇస్రో ప్రకటించింది. జూన్ 19న శుభాంశు యాక్సియం-4 మిషన్‌లో భాగంగా రోదసి ప్రయాణం చేపట్టనున్నాడు.

ఇందుకు ముందు ఈ ప్రయోగం మే 29న జరగాల్సి ఉన్నా, సాంకేతిక కారణాల వల్ల అనేక మార్లు వాయిదా పడింది. ఇప్పుడు అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో, కొత్త తేదీని ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన వెలువడింది.

ఈ మిషన్‌ను అమెరికాలోని ప్రముఖ వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ఇస్రోతో పాటు నాసా (అమెరికా) మరియు ఈఎస్‌ఏ (ఐరోపా అంతరిక్ష సంస్థ) భాగస్వాములుగా ఉన్నారు.

ఇది కూడా చదవండి: Beerla Ilaiah: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో వ్యక్తి ఆత్మహత్య

యాక్సియం-4 మిషన్‌లో శుభాంశు శుక్లా మిషన్ పైలట్‌గా వ్యవహరించనున్నాడు. ఆయనతో పాటు మరో ముగ్గురు అంతరిక్షయాత్రికులు కూడా ఈ ప్రయాణంలో భాగమవుతారు. వీరంతా ఫాల్కన్-9 రాకెట్ ద్వారా అంతరిక్షానికి వెళ్లనున్నారు.

ఈ ప్రయోగం ద్వారా భారత్ అంతరిక్ష రంగంలో మరో ముఖ్యమైన అడుగు వేయబోతోంది. శుభాంశు శుక్లా విజయవంతంగా తన మిషన్‌ను పూర్తిచేస్తే, అది దేశానికి గర్వకారణంగా మారనుంది.

జూన్ 19న అంతరిక్షానికి అడుగుపెట్టబోతున్న శుభాంశుకు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *