Hyderabad: హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్లో శనివారం సాయంత్రం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. పోలీసులు పాత నేరస్తుడు ప్రభాకర్ను పట్టుకునేందుకు పబ్కు వెళ్లగా, ఆయన పోలీసులపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సైబరాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ వెంకట్రెడ్డి, పబ్ బౌన్సర్ గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనతో పబ్లో ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు.

