Hyderabad: నేపాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. అక్కడ చిక్కుకున్న రాష్ట్ర పౌరుల కోసం ప్రత్యేక ఎమర్జెన్సీ హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఈ హెల్ప్లైన్ను ప్రారంభించారు.
ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు నేపాల్లో ఉన్న తెలంగాణ పౌరులెవరికీ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. అయినప్పటికీ, అవసరమైతే వెంటనే సహాయం అందించేందుకు ప్రత్యేక బృందాన్ని సిద్ధంగా ఉంచారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేస్తూ చర్యలు చేపడుతున్నారు.
నేపాల్లో ఎవరైనా చిక్కుకున్న పరిస్థితుల్లో వారి కుటుంబ సభ్యులు ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులను ఈ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు:
వందన – రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రటరీ & లైజన్ హెడ్: 📞 +91 9871999044
జి. రక్షిత్ నాయక్ – లైజన్ ఆఫీసర్: 📞 +91 9643723157
సిహెచ్. చక్రవర్తి – పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్: 📞 +91 9949351270
ప్రభుత్వం తెలంగాణ పౌరులు, వారి కుటుంబ సభ్యులు అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోవద్దని సూచించింది. పౌరుల భద్రత కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేసింది.