Ramachander Rao

Ramachander Rao: తెలంగాణలో గన్‌ కల్చర్‌ పెరుగుతోంది

Ramachander Rao: తెలంగాణ రాష్ట్రంలో గన్‌ కల్చర్‌ పెరిగిందని, శాంతి భద్రతలు క్షీణించాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కేవలం సాధారణ ప్రజలకే కాక, పోలీసులకే రక్షణ లేకుండా పోయిందని ఆయన అన్నారు.

దిగజారిన రైతుల దుస్థితి
రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని రామచందర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం రైతుల చేతులకు బేడీలు వేయించిందని, ఇప్పుడున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం వారిని పోలీసుల కాళ్లు పట్టుకునే దుస్థితికి తీసుకొచ్చిందని విమర్శించారు.

రైతులు తాము పండించిన పంటను కనీస మద్దతు ధరకు అమ్ముకోలేకపోతున్నారని, ప్రభుత్వం వెంటనే ఆ ధాన్యాలను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఉద్యోగులకు పెండింగ్‌ బకాయిలు
“పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్‌ మరియు పెన్షన్ ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రికి లేఖ రాసినా రెండేళ్లుగా వారికి రావాల్సిన డబ్బులు అందడం లేదు. ఐదు డీఏలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్యోగులను, రైతులను మోసం చేస్తోంది” అని రామచందర్‌రావు ఆరోపించారు.

శాంతి భద్రతలపై ఆందోళన
రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి కాంగ్రెస్‌ ప్రభుత్వం మజ్లీస్‌ పార్టీతో కలిసి పనిచేస్తూ వాటిని దెబ్బతీస్తోందని ఆయన అన్నారు.

జూబ్లీహిల్స్‌ లాంటి ప్రాంతంలో కాంగ్రెస్‌ గెలిస్తే, ఆ పార్టీ రౌడీ షీటర్లపై ఉన్న కేసులను ఎత్తివేసి, వారికి కార్పొరేషన్‌ పదవులు ఇస్తుందని రామచందర్‌రావు విమర్శించారు. ఈ విధంగా గన్‌ కల్చర్‌ మరియు రౌడీయిజం పెరుగుతున్నాయంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *