Free Wi-Fi

Free Wi-Fi: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. స్టేషనల్లో వైఫై ఫ్రీ

Free Wi-Fi: భారత ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా దాదాపు 6,115 రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు ఉచిత హైస్పీడ్ వై-ఫై సౌకర్యాన్ని కల్పించింది. డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో కేంద్రం ఈ చర్య చేపట్టింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ముంబయి, కాచిగూడ, సికింద్రాబాద్ వంటి ప్రధాన స్టేషన్లతో పాటు అనేక చిన్న స్టేషన్లలో కూడా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.

రైల్‌టెల్ సహకారంతో వై-ఫై సేవలు
రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ రైల్‌టెల్ సహకారంతో ఈ ఉచిత వై-ఫై సేవలను అందిస్తున్నారు. ఈ సౌకర్యంతో ప్రయాణికులు సినిమాలు, పాటలు, గేమ్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అత్యవసర సమయాల్లో స్టేషన్ పరిసరాల్లో ఆఫీస్ వర్క్ కూడా చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఆయన ఈ వివరాలు వెల్లడించారు.

రైల్వే స్టేషన్లలో ఇప్పటికే టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు 4G/5G కవరేజ్ అందిస్తున్నప్పటికీ, ఈ అదనపు ఉచిత వై-ఫై సేవలు ప్రయాణికుల అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయని వైష్ణవ్ పేర్కొన్నారు.

వై-ఫైను ఎలా కనెక్ట్ చేసుకోవాలి?
ఈ ఉచిత వై-ఫై సేవలను ఉపయోగించుకోవడానికి కొన్ని సులువైన పద్ధతులు ఉన్నాయి:

1. మీ స్మార్ట్‌ఫోన్‌లో వై-ఫై ఆన్ చేయండి.

2. అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌ల జాబితాలో **’RailWire Wi-Fi’**ని ఎంచుకోండి.

3. మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.

4. మీ ఫోన్‌కు SMS ద్వారా ఒక వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) వస్తుంది.

5. ఆ OTPని ఎంటర్ చేసి, హైస్పీడ్ వై-ఫై సేవలను ఆస్వాదించండి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Cooking Oil: ఈ 5 నూనెల​ను వంటకు అస్సలు ఉపయోగించొద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *