Jagadish Reddy

Jagadish Reddy: సీఎం రేవంత్ పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jagadish Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారం కోసం రేవంత్ రెడ్డి మీడియాను, నిరుద్యోగులను, రైతులను వాడుకుని, ఇప్పుడు వారిని పట్టించుకోవడం లేదని, పైగా వారిని చూసి భయపడుతున్నారని ఆరోపించారు.

జగదీష్ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు ఇవి:
“రేవంత్ రెడ్డి ఏ మీడియాను వాడుకొని మా మీద దుష్ప్రచారం చేసి గెలిచిండో.. ఈరోజు వాళ్లనే కొట్టాలనిపిస్తుందట. అధికారం వచ్చిన తర్వాత అసలు రంగు బయటపడుతోంది. గతంలో మీడియాను తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుని, ఇప్పుడు అదే మీడియాను దూషించడం సిగ్గుచేటు.”

“అశోక్ నగర్ ఇష్టమైన ప్రాంతమని నిరుద్యోగులను వాడుకొని.. ఇప్పుడు అశోక్ నగర్ అంటే వణుకుతున్నాడు.” ఎన్నికల ముందు అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగుల సమస్యలపై చర్చలు, ధర్నాలు నిర్వహించి వారిని తనవైపు తిప్పుకున్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఉద్యోగాల గురించి నిరుద్యోగులు అడిగితే స్పందించడం లేదని, అశోక్ నగర్ పేరు వింటేనే భయపడుతున్నారని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు.

“వెంటనే 2 లక్షల రుణాలు తెచ్చుకోండి అని చెప్పి..ఇప్పుడు రైతులను చూసి భయపడుతున్నాడు.” రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, దానికి అనుగుణంగా బ్యాంకుల నుండి రుణాలు తీసుకోవాలని ప్రోత్సహించి, ఇప్పుడు ఆ హామీని నెరవేర్చడంలో విఫలమై, రైతుల ఆగ్రహానికి గురవుతున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. రుణమాఫీ ఆలస్యం కావడం పట్ల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జగదీష్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

“తమ్మీ నీకు 5 లక్షల కార్డు ఇస్తాం అన్నడు.. చెల్లే నీకు స్కూటీ ఇస్తా అన్నడు. ఇప్పుడు అవన్నీ అడిగితే రేవంత్ రెడ్డికి మీడియా వాళ్లు, నిరుద్యోగులు ఆవారా గాల్ల లెక్క కనిపిస్తున్నారు.” ఎన్నికల సమయంలో ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల కార్డులు, మహిళలకు స్కూటీలు వంటి అనేక హామీలు ఇచ్చి, ఇప్పుడు వాటిని అడిగితే ప్రజలను “ఆవారా గాల్ల” లెక్క చూస్తున్నారని జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *