Hawala Money

Hawala Money: దుబాయ్ నుంచి వచ్చిన విద్యార్థులు.. వారి పుస్తకాలు చూసి షాక్ అయిన అధికారులు!

Hawala Money: గత వారం పశ్చిమాసియా దేశమైన దుబాయ్ నుండి విమానంలో ముగ్గురు విద్యార్థులు భారత్ వచ్చారు. మహారాష్ట్రలోని పూణే విమానాశ్రయానికి చేరుకున్న ముగ్గురు విద్యార్థుల వస్తువులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో, ఆ విద్యార్థులు వద్ద అక్రమంగా తరలిస్తున్న కరెన్సీ దొరికింది. వారు తమ వద్ద ఉన్న పుస్తకాలలో 400,000 US డాలర్లు పోలీసులు కనుగొని వాటిని జప్తు చేశారు. దీని భారతీయ విలువ 3.5 కోట్ల రూపాయలు.

Also Read: Rarest of Rare Case: అయ్యో! కన్న తండ్రే కసాయి.. ఆ చిన్నారిని నిర్దాక్షిణ్యంగా చిదిమేశాడు.. నిర్ధారించిన కోర్టు

విద్యార్థులతో ప్రాథమిక విచారణలో, ముగ్గురు విద్యార్థులు గత వారం దుబాయ్ ట్రిప్‌కు వెళ్లారని, పూణేకు చెందిన ట్రావెల్ ఏజెంట్ ఖుష్బు అగర్వాల్ దీనిని ఏర్పాటు చేశారని తేలింది. వారు ముగ్గురూ దేశానికి తిరిగి వచ్చే ముందు, ఖుష్బు అగర్వాల్ వారిని దుబాయ్ నుండి ముఖ్యమైన ఆఫీస్ ఫైళ్లు ఉన్న బ్యాగులను తీసుకురావాలని కోరినట్లు చెప్పారు.

తరువాత, వారు రెండు ట్రాలీ బ్యాగులతో పూణే విమానాశ్రయానికి వచ్చినప్పుడు, వారిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. విద్యార్థులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఖుష్బు అగర్వాల్‌ను ప్రస్తుతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hair Care Tips: బాదం నూనె వాడితే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది తెలుసా ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *