Operation Sindoor

Operation Sindoor: పార్లమెంట్‌లో ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై చర్చకు డేట్‌ ఫిక్స్‌

Operation Sindoor: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంట్‌లో చర్చకు రంగం సిద్ధమైంది. ఈ నెల 28న లోక్‌సభలో, ఆ మరుసటి రోజు 29న రాజ్యసభలో ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరగనుంది. మొత్తం 16 గంటల పాటు సాగే ఈ చర్చలో పలువురు కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి పాల్గొననున్నారు.

లోక్‌సభలో రాజ్‌నాథ్, రాజ్యసభలో జైశంకర్, మోదీ ప్రసంగాలు
లోక్‌సభలో జరగనున్న చర్చను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు. దేశ భద్రతకు సంబంధించిన కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక రాజ్యసభలో జరగనున్న చర్చలో రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా పాల్గొననున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ‘ఆపరేషన్ సింధూర్’ ప్రభావాన్ని వారు వివరించే అవకాశం ఉంది.

ఈ కీలక చర్చలో భాగంగా, ఉభయ సభల్లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ‘ఆపరేషన్ సింధూర్’ లక్ష్యాలు, సాధించిన ప్రగతి, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై ప్రధాని సమగ్ర వివరణ ఇవ్వనున్నారు. ఈ చర్చ దేశ రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *