CM revanth: ప్రజాసేవే కాంగ్రెస్ లక్ష్యం, GHMCలో కూడా విజయం సాధిస్తాం

Cm revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా వివిధ కార్యక్రమాల్లో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ విధానాలు, నగరాభివృద్ధిపై తమ కట్టుబాటును స్పష్టం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి అన్నారు:

“ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా… ప్రజలకు సేవ చేయడమే కాంగ్రెస్ లక్ష్యం. ఈ విజయానికి కష్టపడి పనిచేసిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు. గెలిచినా పొంగిపోము, ఓడినా దిగులుపడము — ఇది కాంగ్రెస్ సంస్కృతి.”

అలాగే GHMC ఎన్నికలపై మాట్లాడుతూ:

“GHMC ఎన్నికల్లో కూడా ఇలాంటి ఫలితాలు సాధిస్తాము. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఆశించిన ఫలితాలు రాలేదు. గత రెండేళ్లుగా ప్రజలు గమనించి ఇప్పుడు తీర్పు ఇచ్చారు. ఈ నగరాన్ని నిజమైన మహానగరంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం.”

ఆయన రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్, మెట్రో విస్తరణ, మూసీ నది ప్రక్షాళన వంటి ప్రధాన ప్రాజెక్టులను వేగవంతం చేస్తామని వెల్లడించారు.

చెరువులు, కుంటల కబ్జాల అంశంపై మాట్లాడుతూ:

“చెరువులు, కుంటలు ఎవరూ కబ్జా చేయకుండా చర్యలు తీసుకుంటున్నాం. సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. హైడ్రా, ఈగల్ ఫోర్స్ వంటి సంస్థలను ప్రజల ప్రయోజనాల కోసం తీసుకొచ్చాం. కేంద్ర నిధులు పొందడంలో కిషన్ రెడ్డి సహకరించడం లేదు.”

సీఎం వ్యాఖ్యలు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *