Chandrababu

Chandrababu: సాయికృష్ణ కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా.. తప్పు చేస్తే ఎంతటివారైనా వదిలేది లేదు

Chandrababu: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయికృష్ణ అదృశ్యం కేసులో బాధితుడి తల్లి విజయలక్ష్మి, కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును ఉండవల్లి నివాసంలో కలిశారు. తమకు న్యాయం చేయాలని కోరగా, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఈ కేసుపై సీనియర్ ఐపీఎస్ అధికారితో ఉన్నత స్థాయి దర్యాప్తు చేయిస్తున్నామని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.

మరింత Chandrababu: సాయికృష్ణ కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా.. తప్పు చేస్తే ఎంతటివారైనా వదిలేది లేదు
Pawan Kalyan

Pawan Kalyan: మణికొండలో జనసేన నూతన ఆఫీస్ ప్రారంభం..!

Pawan Kalyan: తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ మణికొండలో నూతన రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం ఈ ఆఫీస్‌ను ఏర్పాటు చేశారు. ఏ పార్టీ కలిసి రాకపోయినా ఒంటరిగానైనా బరిలోకి దిగుతామని పవన్ ఇప్పటికే స్పష్టం చేయగా.. ఆయన వ్యూహాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

మరింత Pawan Kalyan: మణికొండలో జనసేన నూతన ఆఫీస్ ప్రారంభం..!
Nara Lokesh

Nara Lokesh: కోల్‌కతాలో ఇమామీ, శ్రీ సిమెంట్స్, వీసా స్టీల్ అధినేతలతో మంత్రి నారా లోకేష్ భేటీ!

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే కీలక పారిశ్రామిక, తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ కోల్‌కతాలో వీసా స్టీల్ ఎండీ విశాల్ అగర్వాల్, ఇమామీ గ్రూప్ డైరెక్టర్ ఆదిత్య అగర్వాల్, శ్రీ సిమెంట్స్ వైస్ చైర్మన్ ప్రశాంత్ బంగూర్‌లతో సమావేశమయ్యారు. ప్రధాని మోదీ సంస్కరణలను ప్రశంసించిన లోకేష్, ఏపీలోని విస్తారమైన తీరప్రాంతం, పోర్టులు, భూమి లభ్యత వంటి అనుకూల అంశాలను వివరించి పెట్టుబడులు పెట్టాలని కోరారు. ప్రభుత్వ చొరవలను పారిశ్రామికవేత్తలు అభినందించారు.

మరింత Nara Lokesh: కోల్‌కతాలో ఇమామీ, శ్రీ సిమెంట్స్, వీసా స్టీల్ అధినేతలతో మంత్రి నారా లోకేష్ భేటీ!
AP SSC Supplementary Results: 

AP SSC Supplementary Results: ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈసారి 6.25% పెరిగిన పాస్ పర్సంటేజ్..

AP SSC Supplementary Results: ఏపీ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా వీటిని ప్రకటించారు. ఈసారి మొత్తం 94,990 మందిలో 78,261 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే పాస్ పర్సంటేజ్ 6.25% పెరిగింది. ప్రభుత్వ ’20 రోజుల యాక్షన్ ప్లాన్’ వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ లేదా 95523 00009 నంబర్ ద్వారా వాట్సాప్‌లోనే తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలు పొందవచ్చు.

మరింత AP SSC Supplementary Results: ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈసారి 6.25% పెరిగిన పాస్ పర్సంటేజ్..
Delhi High Court

Delhi High Court:టెలిగ్రామ్‌పై నిషేధాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు

Delhi High Court: టెలిగ్రామ్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థిస్తూ ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. జూన్ 21న జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్ పేపర్ లీక్ కాకుండా ముందస్తు జాగ్రత్తగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఐటీ చట్టం సెక్షన్ 69A కింద ప్లాట్‌ఫారమ్‌లను నిషేధించే అధికారం ప్రభుత్వానికి ఉందని జస్టిస్ తేజస్ కారియా స్పష్టం చేశారు. ఉగ్రవాదం, సైబర్ నేరాలకు టెలిగ్రామ్ డార్క్ వెబ్‌లా మారుతోందన్న కేంద్రం వాదనతో కోర్టు ఏకీభవించింది.

మరింత Delhi High Court:టెలిగ్రామ్‌పై నిషేధాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు
Vijayawada

Vijayawada: సాయికృష్ణ కేసులో సంచలనం.. కృష్ణలంక సీఐ నాగరాజుపై ‘మర్డర్’ కేసు నమోదు

Vijayawada: విజయవాడ రౌడీషీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కృష్ణలంక సీఐ నాగరాజుపై మర్డర్ కేసు నమోదైంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదును సీపీ రాజశేఖర్‌బాబు స్వయంగా స్వీకరించి, సీఐపై BNS సెక్షన్లు 101(1), 127(4), 127(6) కింద కేసు నమోదు చేయించారు. ఈ లాకప్ డెత్ ఆరోపణల కేసు విచారణ అధికారిగా దిశా పీఎస్ ఏసీపీ దైవ ప్రసాద్ నియమితులయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు దర్యాప్తు వేగవంతమైంది.

మరింత Vijayawada: సాయికృష్ణ కేసులో సంచలనం.. కృష్ణలంక సీఐ నాగరాజుపై ‘మర్డర్’ కేసు నమోదు
Kodali Nani

Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి

Kodali Nani: 2021 పంచాయతీ ఎన్నికల సమయంలో చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్‌లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో వైకాపా నేత కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ సమయంలో ఆయన మంత్రిగా ఉన్నందున విచారణకు ప్రభుత్వ పర్మిషన్ అవసరమవడంతో మూడేళ్లుగా ఈ కేసు పెండింగ్‌లో ఉంది. తాజాగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అనుమతి ఉత్తర్వులు జారీ చేయడంతో కోర్టులో విచారణ ముందుకు సాగనుంది.

మరింత Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి
TG High Court

TG High Court: రాయదుర్గం భూముల వేలంపై 3 వారాల స్టే.. రంగంలోకి ఎస్‌బీఐ (SBI)!

TG High Court: హైదరాబాద్‌ పరిధిలోని రాయదుర్గం పరిధిలోని ఐటీ హబ్‌లో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన భూముల వేలంపై దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’(SBI) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

మరింత TG High Court: రాయదుర్గం భూముల వేలంపై 3 వారాల స్టే.. రంగంలోకి ఎస్‌బీఐ (SBI)!
Telegram

Telegram: టెలిగ్రామ్ ఒక ‘కొత్త డార్క్ వెబ్’.. దేశ భద్రతకు పెను ముప్పు..!

Telegram: టెలిగ్రామ్ యాప్ ఒక “కొత్త డార్క్ వెబ్” గా మారిందని, నేరస్థులు, ఉగ్రవాదులు చట్టాల నుండి తప్పించుకోవడానికి దీనిని వాడుతున్నారని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఒకే అకౌంట్‌తో 40 బోట్లను సృష్టించే వీలుండటం వల్ల సైబర్ మోసాలు, ఆధార్ వంటి పౌరుల వ్యక్తిగత డేటా లీక్‌లు, పైరసీ, డ్రగ్స్ స్మగ్లింగ్ వేగంగా విస్తరిస్తున్నాయని ఐ4సి నివేదికలను ఉటంకిస్తూ కేంద్రం తన నిషేధ నిర్ణయాన్ని సమర్థించుకుంది.

మరింత Telegram: టెలిగ్రామ్ ఒక ‘కొత్త డార్క్ వెబ్’.. దేశ భద్రతకు పెను ముప్పు..!
Shubman Gill:

Shubman Gill: కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన శుభ్‌మన్!

Shubman Gill: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 170 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. గిల్ (154), ఇషాన్ కిషన్ (125) రాణించడంతో భారత్ 402 పరుగులు చేసింది. వన్డేల్లో 8వ సారి 400+ స్కోరు చేసి సౌతాఫ్రికా రికార్డును భారత్ సమం చేసింది. ఈ మ్యాచ్‌లో గిల్ వన్డేల్లో 3000 పరుగులు పూర్తి చేసి, అత్యంత వేగంగా (62 ఇన్నింగ్స్‌ల్లో) ఈ మైలురాయిని దాటిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. అయితే బంతుల పరంగా కపిల్ దేవ్ రికార్డును 21 బంతుల తేడాతో మిస్ చేసుకున్నాడు.

మరింత Shubman Gill: కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన శుభ్‌మన్!