SRH vs RR: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. సూర్యవంశీ (97), జురెల్ (50) రాణించడంతో రాజస్థాన్ 243 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో హైదరాబాద్ 196 పరుగులకే ఆలౌట్ అయింది. జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లతో మెరిశాడు. ఈ విజయంతో రాజస్థాన్ క్వాలిఫయర్ 2కు అర్హత సాధించింది.
మరింత SRH vs RR: ఇంటికి వెళ్లిపోయిన హైదరాబాద్.. సన్రైజర్స్పై రాజస్థాన్ రాయల్స్ ‘భారీ’ విజయం..!Author: MAHAA News Desk
Horoscope Today: ఆ రాశుల వారికి అద్భుతమైన శుభయోగాలు.. మీ రాశి ఫలం ఎలా ఉందో చూసుకోండి!
నేటి రాశిఫలాల ప్రకారం వృషభం, మిథునం, సింహం, తుల మరియు కుంభ రాశుల వారికి అద్భుతమైన అనుకూల ఫలితాలు ఉన్నాయి. మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మకరం మరియు మీన రాశుల వారు కొన్ని విషయాల్లో ఓర్పు, జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది.
మరింత Horoscope Today: ఆ రాశుల వారికి అద్భుతమైన శుభయోగాలు.. మీ రాశి ఫలం ఎలా ఉందో చూసుకోండి!Nara Lokesh: మహానాడులో లోకేష్ కీలక నిర్ణయం.. 2029 ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు..!
Nara Lokesh: టీడీపీ మహానాడు సభలో నారా లోకేష్ సంచలన ప్రసంగం చేశారు. 2029 ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు కేటాయించాలని కీలక ప్రతిపాదన చేశారు. వైసీపీని ‘గొడ్డలి పార్టీ’గా అభివర్ణిస్తూ.. బాబాయిని గొడ్డలితో చంపి, తల్లి, చెల్లిని బయటకు గెంటేసిన చరిత్ర జగన్ ది అని విమర్శించారు. తన స్టాన్ఫర్డ్ చదువుకు, జగన్ పేపర్ లీక్ చరిత్రకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. అభివృద్ధిపై చర్చకు రావాలని జగన్కు సవాల్ విసిరారు.
మరింత Nara Lokesh: మహానాడులో లోకేష్ కీలక నిర్ణయం.. 2029 ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు..!Byju Raveendran: బైజూస్ అధినేతకు 6 నెలల జైలు! ₹1.8 లక్షల కోట్ల సామ్రాజ్యం ‘జీరో’ ఎలా అయింది?
Byju Raveendran: ఒకప్పుడు $22 బిలియన్ల విలువైన ఎడ్టెక్ స్టార్టప్ బైజూస్ పూర్తిగా పతనమైంది. నిధుల మళ్లింపు, ఆస్తుల వివరాలు దాచడం వంటి కోర్టు ధిక్కరణ కేసులో వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్కు సింగపూర్ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. భారతదేశంలో బీసీసీఐకి కట్టాల్సిన రూ. 158 కోట్ల బకాయిల కారణంగా ఎన్సిఎల్టి (NCLT) దివాలా ప్రక్రియను ప్రారంభించింది. ఫోర్బ్స్ ప్రకారం ప్రస్తుతం రవీంద్రన్ ఆస్తి విలువ జీరోకి పడిపోయింది.
మరింత Byju Raveendran: బైజూస్ అధినేతకు 6 నెలల జైలు! ₹1.8 లక్షల కోట్ల సామ్రాజ్యం ‘జీరో’ ఎలా అయింది?Chandrababu: ఐటీ నుంచి క్వాంటమ్ దిశగా స్వర్ణాంధ్ర.. ‘గొడ్డలి పార్టీ’ నెవర్ అగైన్!
Chandrababu: టీడీపీ మహానాడు-2026 సభలో సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. ఏపీని ఐటీ నుండి ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ దిశగా తీసుకెళ్తూ 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. మహిళలకు 3 ఉచిత సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని, భవిష్యత్తులో కరెంట్ ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు. వైసీపీని ‘గొడ్డలి పార్టీ’గా అభివర్ణిస్తూ.. రక్తచరిత్ర రాసేవారు స్వర్ణాంధ్రను నిర్మించలేరని విమర్శించారు.
మరింత Chandrababu: ఐటీ నుంచి క్వాంటమ్ దిశగా స్వర్ణాంధ్ర.. ‘గొడ్డలి పార్టీ’ నెవర్ అగైన్!Bakrid Special Recipe: బక్రీద్ స్పెషల్.. ప్రతిసారీ మటన్ కోర్మానేనా? ఈసారి ఈ ‘4’ వెరైటీ మటన్ రెసిపీస్ ట్రై చేసి చూడండి!
Bakrid Special Recipe: బక్రీద్ సందర్భంగా ఎప్పుడూ చేసే మటన్ కోర్మా కాకుండా ఈసారి డిఫరెంట్గా ట్రై చేయడానికి 4 రకాల వంటకాలు (మటన్ కల్మీ కబాబ్, మటన్ సుక్కా, మటన్ పెప్పర్ ఫ్రై, మటన్ ఘీ రోస్ట్) తయారీ విధానం ఇక్కడ ఇవ్వబడింది. ఇవన్నీ తక్కువ సమయంలోనే ఎంతో స్పైసీగా, టేస్టీగా తయారు చేసుకోవచ్చు.
మరింత Bakrid Special Recipe: బక్రీద్ స్పెషల్.. ప్రతిసారీ మటన్ కోర్మానేనా? ఈసారి ఈ ‘4’ వెరైటీ మటన్ రెసిపీస్ ట్రై చేసి చూడండి!Supreme Court: SIR ప్రక్రియకు సుప్రీంకోర్టు గ్రీన్సిగ్నల్
Supreme Court: ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈసీ చర్యలు హేతుబద్ధమేనని పేర్కొంటూ అధికారుల నిర్ణయాలను సమర్థించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఓటర్ల జాబితా రూపకల్పన, సవరణలపై ఎన్నికల సంఘానికి పూర్తి అధికారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మరింత Supreme Court: SIR ప్రక్రియకు సుప్రీంకోర్టు గ్రీన్సిగ్నల్Viral News: ట్రైన్లో వృద్ధుడికి సీట్ ఇప్పించిన రైల్వే పోలీస్.. ప్రయాణికులకు మానవత్వంపై క్లాస్.. వీడియో వైరల్!
Viral News: మనం చూస్తూనే ఉంటాం ప్రతి రోజు ట్రైన్ లలో వందల మంది ప్రయాణిస్తుంటారు. టికెట్ తీసుకోని వెంటనే సీట్ కోసం యువకులు పరుగులు తీస్తుంటారు. సీట్ దొరికితే పక్కన వృద్ధులు ఉన్నా వారిని చూసి చూడనట్లే ఉంటారు
మరింత Viral News: ట్రైన్లో వృద్ధుడికి సీట్ ఇప్పించిన రైల్వే పోలీస్.. ప్రయాణికులకు మానవత్వంపై క్లాస్.. వీడియో వైరల్!Peddi Premieres: నిజాం ప్రీమియర్స్ పై వీడని సస్పెన్స్.. ఫ్యాన్స్లో పెరుగుతున్న టెన్షన్!
Peddi Premieres: రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా విడుదలకు వారం రోజులే ఉండగా నిజాం ప్రాంతంలో ప్రీమియర్ షోలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎగ్జిబిటర్ల పర్సంటేజ్ వివాదం వల్ల తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలపై అనిశ్చితి నెలకొంది. ఏపీలో మాత్రం అనుమతులు సులభంగానే వచ్చేలా ఉన్నాయి. స్పాయిలర్స్ రాకుండా అన్ని చోట్లా ఒకేసారి షోలు పడేలా సమస్యను పరిష్కరించే పనిలో నిర్మాత సతీష్ కిలారు అండ్ టీమ్ ఉన్నారు.
మరింత Peddi Premieres: నిజాం ప్రీమియర్స్ పై వీడని సస్పెన్స్.. ఫ్యాన్స్లో పెరుగుతున్న టెన్షన్!ED Raids: మాజీ సీఎం ఇంట్లో ఈడీ సోదాలు.. అవినీతి కేసులో ఇరుకున్న కూతురు
ED Raids: కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ కుమార్తె టి. వీణకు చెందిన ఎక్సాలోజిక్ సంస్థ ఎలాంటి సేవలు అందించకుండానే CMRL కంపెనీ నుండి రూ.1.72 కోట్లు (SFIO ప్రకారం రూ.2.70 కోట్లు) పొందిందనే ఆరోపణలపై ఈడీ కేరళలో 10 చోట్ల సోదాలు చేసింది. ఇందులో మాజీ సీఎం ఇల్లు, ఆయన అల్లుడు (ఎమ్మెల్యే రియాస్) నివాసం కూడా ఉన్నాయి. కంపెనీల చట్టంలోని సెక్షన్ 447 కింద వీణపై కేసు నమోదు కాగా, ఇందులో గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
మరింత ED Raids: మాజీ సీఎం ఇంట్లో ఈడీ సోదాలు.. అవినీతి కేసులో ఇరుకున్న కూతురు