Keerthy Suresh: బాలీవుడ్లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ సెట్ అవుతోంది. సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్, బాలీవుడ్ నటుడు రాజ్కుమార్ రావ్తో కలిసి ఓ కొత్త సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది. ఈ చిత్రం షూటింగ్ కూడా జూన్ 1 నుంచి ముంబైలో ప్రారంభం కానుందని సమాచారం.
కీర్తి సురేష్ ఇప్పటికే తెలుగు, తమిళ చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఇప్పుడు బాలీవుడ్లోనూ సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు, రాజ్కుమార్ రావ్ తన వైవిధ్యమైన పాత్రలతో హిందీ సినిమా ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు: రిలీజ్ డేట్పై ఆగని సస్పెన్స్..!
Keerthy Suresh: ఈ సినిమా గురించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాకపోయినా, షూటింగ్ షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. మరి బేబీ జాన్ సినిమాతో ప్లాప్ చూసిన కీర్తీ ఈ సినిమాతో ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.